వైఎస్సార్‌సీపీ నగర అధ్యక్షునిగా వంశీకృష్ణ శ్రీనివాస్‌

Vamshikrishna Srinivas As Visakhapatnam YSRCP President - Sakshi

డాబాగార్డెన్స్‌(విశాఖ దక్షిణ): వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ విశాఖ నగర శాఖ అధ్యక్షుడిగా వంశీకృష్ణ శ్రీనివాస్‌ యాదవ్‌ నియమితులయ్యారు. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం గురువారం విడుదల చేసిన ఓ ప్రకటనలో పేర్కొం ది. పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు వంశీకృష్ణ శ్రీనివాస్‌ను నగర అధ్యక్షుడిగా నియమించారు. వైఎస్సార్‌ సీపీ ఆవిర్భావం తర్వాత కొన్నేళ్ల పాటు నగర అధ్యక్షుడిగా పనిచేసిన వంశీకృష్ణ గత ఎన్నికల్లో వైఎస్సార్‌ సీపీ నుంచి పోటీ చేశారు. ప్రస్తుతం తూర్పు నియోజకవర్గ సమన్వయకర్తగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

విశాఖ పార్లమెంట్‌ జిల్లా పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా బెహరా
విశాఖ పార్లమెంట్‌ జిల్లా పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా బెహరా భాస్కరరావు నియమితులయ్యారు. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం గురువారం విడుదల చేసిన ఓ ప్రకటనలో పేర్కొంది. ఈయన ఇటీవల కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేసి వైఎస్సార్‌ సీపీలో చేరారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top