టీడీపీకి మరోసారి షాక్‌ | Sakshi
Sakshi News home page

టీడీపీకి మరోసారి షాక్‌

Published Tue, Mar 17 2020 4:37 PM

TDP Cadre Join In YSRCP - Sakshi

సాక్షి, నెల్లూరు: టీడీపీకి మరోసారి షాక్‌ తగిలింది. నెల్లూరు జిల్లా టీడీపీ అధికార ప్రధానిధి సీ.ఎచ్‌. హరిబాబు యాదవ్‌ వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరనున్నారు. ఆయన నెల్లూరు రూరల్‌ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డితో మంతనాలు జరిపారు. దీంతో హరిబాబు త్వరలో వైఎస్సార్‌సీపీ పార్టీలోకి చేరనున్నట్లు సమాచారం. సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో వెంకటాచలం మండలం, సర్వేపల్లికి చెందిన 70 కుటుంబాలు వైఎస్సార్‌సీపీలో చేరారు. పెదకాకానికి చెందిన 40 కుటుంబాల టీడీపీ కార్యకర్తలు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. పొన్నూరు ఎమ్మెల్యే కిలారి రోశయ్య వారికి పార్టీ కండువాలు కప్పి వారిని ఆహ్వానించారు. 

పశ్చిమగోదావరి: ఉండి మండలం చిలుకూరులో టీడీపీ ఖాళీ అయింది. మాజీ ఏఎంసీ చైర్మన్ చిలుకూరి నరసింహరాజు, గ్రామ టీడీపీ పార్టీ అధ్యక్షుడు ముదునూరి సోమరాజు, రెండువందల మంది టీడీపీ కార్యకర్తలు ఉండి వైఎస్సార్‌సీపీ ఇంచార్జి పీవీఎల్ నరసింహరాజు ఆధ్వర్యంలో పార్టీలో చేరారు.

కృష్ణా: గంపలగూడెం మండలం దుందిరాలపాడులో టీడీపీ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన  వంద మంది వైఎస్సార్‌సీపీలో చేరారు. వీరికి పార్టీ కండువాలు కప్పి మండల పార్టీ కన్వీనర్ చావా వెంకటేశ్వరరావు సాదరంగా ఆహ్వానించారు.

Advertisement
Advertisement