రెండు ఏనుగుల మధ్య నలిగిపోయాం: తమ్మినేని  | Tammineni Veerabhadram comments on Prajakutami and TRS | Sakshi
Sakshi News home page

రెండు ఏనుగుల మధ్య నలిగిపోయాం: తమ్మినేని 

Dec 12 2018 2:05 AM | Updated on Jul 11 2019 9:08 PM

Tammineni Veerabhadram comments on Prajakutami and TRS - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఈ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌–కాంగ్రెస్‌ కూటమి అనే రెండు ఏనుగుల మధ్య నలిగిపోయామని సీపీఎం కార్యదర్శి తమ్మినేని వీరభద్రం వ్యాఖ్యానించారు. ప్రత్యామ్నాయ విధానాలు–సామాజికన్యాయం నినాదంతో రాష్ట్ర రాజకీయాల్లో కొత్త మార్పు తీసుకొచ్చేందుకు సీపీఎం–బీఎల్‌ఎఫ్‌ ప్రయత్నం చేసినా  ఫలించలేదన్నారు.

సామాజిక న్యాయ సాధనకు ప్రత్యామ్నాయ విధానాలు కావాలంటూ సిద్ధాంతాలు మాట్లాడిన సీపీఐ, టీజేఎస్, ప్రజాగాయకుడు గద్దర్, బీసీ సంక్షేమ సంఘం నేత ఆర్‌.కృష్ణయ్య, ఎమ్మార్పీఎస్‌ నేత మంద కృష్ణమాదిగ చివరకు కాంగ్రెస్‌ చంకలో చేరడంతో అనుకున్న ఫలితాలు సాధించలేకపోయామని చెప్పారు. టీఆర్‌ఎస్‌ సర్కార్‌ అమలు చేసిన సంక్షేమ పథకాలు ఆ పార్టీకి సానుకూల ఫలితాలకు కారణమయ్యాయని తెలిపారు. 

Advertisement
 
Advertisement
Advertisement