ఆంధ్రప్రదేశ్లోని కూటమి ప్రభుత్వ తీరుపై సీపీఎం నేత శ్రీనివాసరావు ఫైర్ అయ్యారు. ఆంధ్రప్రదేశ్లో రెండేళ్లుగా చోటుచేసుకుంటున్న పరిణామాలపై ఆయన స్పందించారు. ఏపీని కూటమి ప్రభుత్వం మార్చుతున్న తీరుపై శ్రీనివాసరావు విమర్శలు గుప్పించారు.
శ్రీనివాసరావు ఆదివారం మీడియాతో మాట్లాడుతూ... కూటమి రెండేళ్ల పాలన గాడి తప్పిందని చెప్పారు. ఏపీని విషాదాంధ్రప్రదేశ్గా మార్చేశారని తెలిపారు. ప్రజాసమస్యల పరిష్కారంలో కూటమి విఫలమైందని చెప్పారు. కమ్యూనిస్టులపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్వి మతిలేని వ్యాఖ్యలని ఆయన విమర్శించారు.


