‘మంద బలంతో అసెంబ్లీలో చట్టసవరణ’

round table meeting on 2013 Land Reform Legislation Amendment - Sakshi

సాక్షి, విజయవాడ: భూ హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో రౌండ్‌ టేబుల్‌ సమావేశాలు విజయవాడలో ఏర్పాటు చేశారు. 2013 భూసేకరణ చట్ట సవరణకు వ్యతిరేకంగా ఈ సమావేశాలు జరుగుతున్నాయి. వీటికి పెద్దసంఖ్యలో రైతు, ప్రజాసంఘల నాయకులు హాజరయ్యారు. ఈ సమావేశంలో వైఎస్‌ఆర్‌సీపీ రైతు విభాగం నేత నాగిరెడ్డి మాట్లాడుతూ.. సీఎం చంద్రబాబు నాయుడు తన మంద బలంతో అసెంబ్లీలో చట్టసవరణ చేశారు.

ఈ సవరణ చట్టం రైతులకు తుట్లు పొడిచే విధంగా ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. పంటలు పండే పొలాలను రైతులకు ఇష్టం లేకపోయినా భూములను లాక్కోవాలని చూస్తోందని నాగిరెడ్డి అన్నారు.
 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top