హిందుస్థాన్‌ జిందాబాద్‌.. దిల్‌కీ అవాజ్‌.. | Rajasingh Sing For Sri Ramanavami Special Song | Sakshi
Sakshi News home page

హిందుస్థాన్‌ జిందాబాద్‌.. దిల్‌కీ అవాజ్‌..

Apr 13 2019 6:22 AM | Updated on Apr 13 2019 6:22 AM

Rajasingh Sing For Sri Ramanavami Special Song - Sakshi

పాటపాడుతున్న రాజాసింగ్‌ లోథా

జియాగూడ: హిందుస్థాన్‌ జిందాబాద్‌.. దిల్‌కీ అవాజ్‌.. హర్‌ దిల్‌కీ అవాజ్‌.. అవుతుందని గోషామహల్‌ ఎమ్మెల్యే, శ్రీరామ్‌ యువసేన భాగ్యనగర్‌ అధ్యక్షుడు టి.రాజాసింగ్‌ లోథా అన్నారు. ప్రతి యేటా శ్రీరామనవమి శోభాయాత్రలో తనే స్వయంగా రచించిన ఒక పాటను పాడడం జరుగుతుందని ఆయన తెలిపారు. ఈసారి శ్రీరామనవమి శోభాయాత్రలో హిందుస్థాన్‌ జిందాబాద్‌.. దిల్‌కే అవాజ్‌.. హర్‌ దిల్‌కీ అవాజ్‌ పాటను పాడడం జరిగిందన్నారు. ఈ పాటను సైనికులకు అంకితం ఇస్తున్నట్లు తెలిపారు. ఇప్పటి వరకు మూడు దేశభక్తి పాటలు ఐదు శ్రీరాముడిపై రచించానని వెల్లడించారు. శోభాయాత్ర రోజున ఈ పాటను ప్రజల సమక్షంలో కూడా పాడి వినిపిస్తానని రాజాసింగ్‌ తెలిపారు. పాటల సీడీలను లాంచ్‌ చేయనున్నట్లు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement