ఫారం-7 పేరుతో తప్పుడు కేసులు: రౌతు

Rajamahendravaram YSRCP Leader Routhu Suryaprakash Rao complaints To Police In Rajamahendravaram Over Removing Of Votes - Sakshi

తూర్పుగోదావరి : ఓట్ల తొలగింపుపై చర్యలు తీసుకోవాలంటూ రాజమహేంద్రవరం త్రీటౌన్‌ పోలీస్‌స్టేషన్‌లో వైఎస్సార్‌సీపీ నాయకులు ఫిర్యాదు చేశారు. వైఎస్సార్సీపీ రాజమహేంద్రవరం సమన్వయకర్త రౌతు సూర్యప్రకాశ రావు మాట్లాడుతూ.. ఫారం-7 పేరుతో వైఎస్సార్‌సీపీకి చెందిన వారిపై తప్పుడు కేసులు పెడుతున్నారని ఆరోపించారు. పార్టీ మారేందుకు అంగీకరించని వారిని రాజమహేంద్రవరంలో టీడీపీ నాయకులు కేసులతో భయపెడుతున్నారని అన్నారు. వైఎస్సార్సీపీ ఓటర్లు అసలు పోలింగ్‌ బూత్‌లకే రాకుండా ఉండేందుకు కుట్రలు పన్నుతున్నారని రౌతు ఆరోపించారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top