జయనగరలో పోలింగ్‌ ప్రశాంతం | Polling is peaceful in jayanagar | Sakshi
Sakshi News home page

జయనగరలో పోలింగ్‌ ప్రశాంతం

Jun 12 2018 2:47 AM | Updated on Jun 12 2018 2:47 AM

Polling is peaceful in jayanagar - Sakshi

జయనగర: బెంగళూరులోని జయనగర నియోజకవర్గంలో సోమవారం నిర్వహించిన పోలింగ్‌ ప్రశాంతంగా ముగిసింది. ఈ ఎన్నికలో 55 శాతం పోలింగ్‌ నమోదైంది. జయనగర బీజేపీ సిట్టింగ్‌ ఎమ్మెల్యే విజయ్‌కుమార్‌ అకస్మికంగా చనిపోవడంతో ఇక్కడ మే 12న జరగాల్సిన ఎన్నికలు వాయిదాపడ్డాయి. ఈ ఎన్నికలో బీజేపీ తరఫున విజయ్‌ సోదరుడు ప్రహ్లాద, కాంగ్రెస్‌ తరఫున మాజీ మంత్రి రామలింగారెడ్డి కుమార్తె సౌమ్య పోటీ పడ్డారు. కాంగ్రెస్‌–జేడీఎస్‌ కూటమి అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో సౌమ్యాకు జేడీఎస్‌ మద్దతు ప్రకటించింది. జూన్‌ 13న ఓట్ల లెక్కింపును చేపట్టనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement