పరామర్శలోనూ రాజకీయాలా? | Parrikar slams Rahul for politicising courtesy visit | Sakshi
Sakshi News home page

పరామర్శలోనూ రాజకీయాలా?

Jan 31 2019 3:40 AM | Updated on Jan 31 2019 3:40 AM

Parrikar slams Rahul for politicising courtesy visit - Sakshi

సిబ్బంది సాయంతో అసెంబ్లీలో బడ్జెట్‌ ప్రవేశపెట్టేందుకు వస్తున్న పారికర్‌

న్యూఢిల్లీ: అనారోగ్యంతో ఉన్న వ్యక్తిని పరామర్శించి, దానిని రాజకీయ ప్రయోజనాలకు ఉపయోగించడం తగదని గోవా సీఎం మనోహర్‌ పారికర్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీపై ధ్వజమెత్తారు. మంగళవారం పారికర్‌ను పరామర్శించిన అనంతరం రాహుల్‌గాంధీ కోచిలో ఓ సమావేశంలో మాట్లాడుతూ తమ మధ్య రఫేల్‌ కుంభకోణంపై చర్చ జరిగిందని వెల్లడించిన విషయం విదితమే. అనిల్‌ అంబానీకి ప్రయోజనం కలిగించేందుకు మోదీ ప్రయత్నించారని, ఈ విషయంలో పారికర్‌ తనకు సంబం ధం లేదని తెలిపారని రాహుల్‌ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. దీనిపై పనాజీలోని గోవా అసెంబ్లీ భవనంలో పారికర్‌ మాట్లాడుతూ ‘రాహుల్‌తో నా భేటీ కేవలం అయిదు నిమిషాలు మాత్రమే జరిగింది. ఆ భేటీలో రాహుల్‌ రఫేల్‌పై మాట్లాడలేదు. అసలు భేటీలో ఆ అంశమే ప్రస్తావనకు రాలేదు’ అని స్పష్టం చేశారు. తనతో జరిగిన పరామర్శ భేటీని కూడా రాహుల్‌ అల్పమైన రాజకీయం చేస్తున్నారని విమర్శించారు. బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షా కూడా రాహుల్‌పై మండిపడ్డారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement