పరామర్శలోనూ రాజకీయాలా? | Parrikar slams Rahul for politicising courtesy visit | Sakshi
Sakshi News home page

పరామర్శలోనూ రాజకీయాలా?

Jan 31 2019 3:40 AM | Updated on Jan 31 2019 3:40 AM

Parrikar slams Rahul for politicising courtesy visit - Sakshi

సిబ్బంది సాయంతో అసెంబ్లీలో బడ్జెట్‌ ప్రవేశపెట్టేందుకు వస్తున్న పారికర్‌

న్యూఢిల్లీ: అనారోగ్యంతో ఉన్న వ్యక్తిని పరామర్శించి, దానిని రాజకీయ ప్రయోజనాలకు ఉపయోగించడం తగదని గోవా సీఎం మనోహర్‌ పారికర్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీపై ధ్వజమెత్తారు. మంగళవారం పారికర్‌ను పరామర్శించిన అనంతరం రాహుల్‌గాంధీ కోచిలో ఓ సమావేశంలో మాట్లాడుతూ తమ మధ్య రఫేల్‌ కుంభకోణంపై చర్చ జరిగిందని వెల్లడించిన విషయం విదితమే. అనిల్‌ అంబానీకి ప్రయోజనం కలిగించేందుకు మోదీ ప్రయత్నించారని, ఈ విషయంలో పారికర్‌ తనకు సంబం ధం లేదని తెలిపారని రాహుల్‌ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. దీనిపై పనాజీలోని గోవా అసెంబ్లీ భవనంలో పారికర్‌ మాట్లాడుతూ ‘రాహుల్‌తో నా భేటీ కేవలం అయిదు నిమిషాలు మాత్రమే జరిగింది. ఆ భేటీలో రాహుల్‌ రఫేల్‌పై మాట్లాడలేదు. అసలు భేటీలో ఆ అంశమే ప్రస్తావనకు రాలేదు’ అని స్పష్టం చేశారు. తనతో జరిగిన పరామర్శ భేటీని కూడా రాహుల్‌ అల్పమైన రాజకీయం చేస్తున్నారని విమర్శించారు. బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షా కూడా రాహుల్‌పై మండిపడ్డారు.

Advertisement
 
Advertisement
Advertisement