
సాక్షి, హైదరాబాద్: నల్లగొండ అమరుల స్ఫూర్తి యాత్ర, కొలువుల కొట్లాట విషయంలో రాష్ట్ర ప్రభుత్వం రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరించినందునే తాము కోర్టుకు వెళ్లామని, ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించినా తాము ముందుకే సాగుతామని టీజేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం అన్నారు.
సోమవారం హైదరాబాద్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. జేఏసీ సభలను ప్రభుత్వం కక్షపూరితంగా అడ్డుకునే ప్రయత్నం చేస్తోందన్నారు. ‘జేఏసీ నేతలు ఎవరినీ నిర్భందించరాదని కోర్టు ఆదేశించింది. అయినా అరెస్టులు చేస్తున్నారు. మంగళవారం ఉదయం కోర్టు నిర్ణయం వెలువడుతుంది. కొలువుల కొట్లాట సభకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకున్నాం. కోర్టు అనుమతినిస్తుందని ఆశిస్తున్నా. అప్పటివరకు సభకు వచ్చే వారు ప్రయాణాలు వాయిదా వేసుకోండని కోదండరాం తెలిపారు.