బెంగళూరు/న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠ రేకెత్తించడంతో పాటు.. కాంగ్రెస్, బీజేపీలు నువ్వా, నేనా అన్న రీతిలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తలపడ్డ కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు శనివారం ప్రశాంతంగా ముగిశాయి. కొత్త ప్రభుత్వాన్ని ఎన్నుకునేందుకు దాదాపు 5 కోట్ల మంది ఓటర్లలో 70 శాతం మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. సాయంత్రం 6 గంటలు దాటినా చాలామంది ఓటర్లు క్యూలైన్లలో వేచివున్న నేపథ్యంలో ఓటింగ్ శాతం మరింత పెరగవచ్చని కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది. కాగా 2013 అసెంబ్లీ ఎన్నికల్లో 71.4 శాతం పోలింగ్ నమోదైంది. కర్ణాటకలో 224 అసెంబ్లీ స్థానాలకు గాను 222 చోట్ల పోలింగ్ జరగ్గా.. బీజేపీ అభ్యర్థి మృతితో జయనగర స్థానంలో, భారీగా నకిలీ ఓటరు గుర్తింపు కార్డులు బయటపడటంతో ఆర్ఆర్ నగర్ స్థానంలో ఓటింగ్ వాయిదా పడిన సంగతి తెలిసిందే. అన్ని స్థానాల్లో అధికార కాంగ్రెస్, బీజేపీలు హోరాహోరీ పోటీపడగా.. అనేక స్థానాల్లో కుమారస్వామి నేతృత్వంలోని జేడీఎస్ గట్టి పోటీనిచ్చింది.
2,600 మంది అభ్యర్థులు
ఈ ఎన్నికల్లో మొత్తం 2,600 మంది అభ్యర్థులు అదృష్టాన్ని పరీక్షించుకోగా.. కాంగ్రెస్ నుంచి ప్రస్తుత సీఎం సిద్దరామయ్య, మాజీ సీఎంలు బీఎస్ యడ్యూరప్ప, జగదీష్ షెట్టార్లు బీజేపీ తరఫున, హెచ్డీ కుమార స్వామి జేడీఎస్ నుంచి ఎన్నికల బరిలో తలపడ్డారు. స్వల్ప ఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతంగా జరిగిందని ఈసీ అధికారులు పేర్కొన్నారు. కొన్ని పోలింగ్ కేంద్రాల్లోని ఈవీఎంల్లో లోపాలు తలెత్తగా.. పలు చోట్ల కాంగ్రెస్, బీజేపీ మద్దతుదారుల మధ్య ఘర్షణలు చోటు చేసుకున్నాయి. ఓటర్లను ప్రలోభపెట్టేందుకు ప్రయత్నించారంటూ కాంగ్రెస్, బీజేపీలు పరస్పరం ఆరోపణలు చేసుకు న్నాయి. ‘సాయంత్రం 6 గంటల వరకూ మొత్తం 70 శాతం మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. కొన్ని పోలింగ్ కేంద్రాలు మినహా అన్ని చోట్ల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది’ అని సీనియర్ డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ ఉమేశ్ సిన్హా తెలిపారు.
గ్రామీణ ప్రాంతాల్లో అత్యధిక ఓటింగ్
పట్టణ ఓటర్ల కంటే గ్రామీణ ప్రాంత ఓటర్లు అత్యధిక సంఖ్యలో పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చారు. మధ్యాహ్నం వరకూ కొంత మందకొడిగా సాగిన ఓటింగ్ ఆ తర్వాత ఊపందుకుంది. ఉదయాన్నే ఓటు వేసిన వారిలో ప్రముఖ క్రికెటర్లు రాహుల్ ద్రవిడ్, అనిల్ కుంబ్లే, సినీ నటులు రమేశ్ అరవింద్, రవిచంద్రన్, మైసూరు రాజవంశీకుడు యదువీర్ కృష్ణదత్త వడియార్లు ఉన్నారు.
కర్ణాటకలో 70 శాతం పోలింగ్
Published Sun, May 13 2018 3:05 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
T20 WC 2024: టీమిండియా టీ20 వరల్డ్ కప్ జెర్సీ ఇదే.. ఫోటోలు వైరల్
కాంగ్రెస్కు పాకిస్తాన్ మద్దతు ఉంది: అనురాగ్ ఠాకూర్
టాలీవుడ్ హీరో డ్రీమ్ ప్రాజెక్ట్.. రెబల్ స్టార్ ఎంట్రీ!
ఇరాన్ నుంచి పారిపోయి కొచ్చికి భారత మత్స్యకారులు
పాఠశాల నేపథ్యంలో వస్తోన్న సత్య.. ఆసక్తిగా ట్రైలర్!
Best Pictures Of The Day : ఈ రోజు ఉత్తమ చిత్రాలు (06-05-2024)
Video: కేసీఆర్ బస్సును తనిఖీ చేసిన ఎన్నికల అధికారులు
'దేవర' షూటింగ్లో తేనెటీగల కలకలం.. 20 మందికి గాయాలు
ఎస్ఆర్హెచ్తో ముంబై కీలక పోరు.. కొత్త ప్లేయర్ ఎంట్రీ
వారితో భయంకరమైన అనుభవాలు ఎదుర్కొన్నా: హీరామండి నటి
తప్పక చదవండి
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- సూపర్ మచ్చీ.. ఇలాంటి గ్రూపు డ్యాన్స్ మీరెపుడైనా చూశారా?
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- పూంచ్ ఉగ్రదాడి.. టెర్రరిస్టులపై రూ.20 లక్షల రివార్డు
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- ‘SRH కాదు.. పరుగుల విధ్వంసానికి మారు పేరు ఆ జట్టే’
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement