కోదండరాం రాజకీయ పార్టీకి ఈసీ గ్రీన్‌ సిగ్నల్‌

EC Approves Kodandaram New Party Telangana Jana Samithi - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: టీజేఏసీ చైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదండరాం ఏర్పాటు చేయనున్న రాజకీయ పార్టీకి ఎన్నికల కమిషన్‌ ఆమోదముద్ర వేసింది. ‘తెలంగాణ జన సమితి’ పేరుతోపాటు ఇతర అనుమతులు లభించాయని శనివారం జేఏసీ వర్గాలు వెల్లడించాయి.

కసరత్తు ముమ్మరం: ఈసీ అనుమతి లభించిన దరిమిలా పార్టీని అధికారికంగా జనం ముందుకు తెచ్చేందుకు టీజేఏసీ సన్నాహాలను ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా ఏప్రిల్‌ 2న కోదండరాం అధికారిక ప్రకటన చేస్తారని, ఏప్రిల్‌ 4న పార్టీ జెండాను ఆవిష్కరిస్తారని తెలిసింది. తెలంగాణ జన సమితి ఆవిర్భావాన్ని పురస్కరించుకుని ఏప్రిల్‌ 29న భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు సమాచారం.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top