
సాక్షి, తూర్పు గోదావరి : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, జననేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి 235వ రోజు ప్రజాసంకల్పయాత్రను ముగించారు. నేడు వైఎస్ జగన్ 9.6 కిలోమీటర్లు నడిచారు. ప్రజల సమస్యలు తెలుసుకుంటూ.. వారికి నేనున్నా అని భరోసా ఇస్తూ జననేత ముందుకు సాగుతున్నారు. ఆదివారం ఉదయం తుని నియోజకవర్గంలోని తుని నైట్క్యాంపు నుంచి జననేత పాదయాత్రను ప్రారంభించారు. అనంతరం రేఖవానిపాలెం, మరువాడ, నందివొంపు, గండి మీదుగా డి.పోలవరం వరకు పాదయాత్ర కొనసాగింది. ఇప్పటివరకు ఆయన మొత్తం 2,711.4 కిలోమీటర్లు నడిచారు.