
సాక్షి, గుంటూరు : బీజేపీ పాలనలో గవర్నర్ వ్యవస్థ బ్రోకర్లా మారిందని సీపీఐ నేత నారాయణ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఆయన మీడియాతో సమావేశంలో మాట్లాడుతూ... కర్ణాటకలో గవర్నర్ కళ్ళున్న కబోదిలా మారారని ఆరోపించారు.
నేటి సుప్రీంకోర్టు తీర్పుతో న్యాయ వ్యవస్థ ఇంకా బ్రతికే ఉందనే భరోసా కలిగిందని అన్నారు. బీజేపీకి అనుకులంగా వ్యవహరించిన గవర్నర్ను వెంటనే భర్తరఫ్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు.