కృష్ణరాజపురం : బెంగళూరు సెంట్రల్ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా బహుభాష నటుడు ప్రకాశ్రాజ్ దాఖలు చేసిన నామినేషన్ను తిరస్కరించాలని బీజేపీ నేత గిరీశ్కుమార్ నాయుడు డిమాండ్ చేశారు. ఈమేరకు శుక్రవారం ఎన్నికల అధికారికి వినతిపత్రం అందించారు. కర్ణాటకతో పాటు తమిళనాడులో రెండు, తెలంగాణ రాష్ట్రంలో ఒకటి చొప్పున ఎన్నికల గుర్తింపు కార్డులు కలిగిఉన్న నేపథ్యంలో ప్రకాశ్రాజ్ నామినేషన్ను తిరస్కరించాలని విజ్ఞప్తి చేశారు. అన్ని ప్రాంతాల్లోనూ ఎన్నికల గుర్తింపు కార్డులో ప్రకాశ్రాజ్ సన్నాఫ్ మంజునాథ రై అని ఉందని ఫిర్యాదులో గిరీశ్కుమార్ పేర్కొన్నాడు.
ప్రకాశ్రాజ్ నామినేషన్ తిరస్కరించండి
Published Sat, Mar 30 2019 8:31 AM
Related news
-
బీజేపీ ఎజెండా రిజర్వేషన్ల రద్దే..: సీఎం రేవంత్రెడ్డి
సాక్షి, హైదరాబాద్: రిజర్వేషన్లను రద్దు చేయడమే ఆర్ఎస్ఎస్ మూల సిద్ధాంత మని, దాన్ని అమలు చేయడమే బీజేపీ ఎజెండా అని సీఎం రేవంత్రెడ్డి ఆరోపించారు. రాజ్యాంగాన్ని మార్చేందుకు బీజేపీ వేసుకున్న ప్రణాళికలను మాత్రమే తాను ప్రస్తావించానని.. ఆధా రాలతో సహా తాను చెప్తున్న అంశాలపై కేంద్రం వివరణ ఇవ్వడంగానీ, సవరించుకోవడం గానీ చేయాలని స్పష్టం చేశా రు. రేవంత్రెడ్డి బుధవారం సాయంత్రం తన నివాసంలో మీడి యాతో మాట్లాడారు. వివరాలు ఆయన మాటల్లోనే..‘‘సమయం, సందర్భం, అవకాశం వచ్చిన ప్రతీ సందర్భంలో రాజ్యాంగాన్ని మార్చి ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్లను రద్దు చేయాలనే ఎజెండాతోనే బీజేపీ పనిచేస్తోంది. ఆ విషయాన్నే నేను ప్రస్తావించడంతో దేశవ్యాప్తంగా చర్చ జరుగు తోంది. తమ ఎన్నికల ప్రయోజనాలకు దెబ్బతగులుతుందనే భయంతో కప్పి పుచ్చుకునేందుకు బీజేపీ ప్రయత్నిస్తోంది. అందులో భాగంగానే కేంద్ర హోంశాఖ ఫిర్యాదు చేసి నాపై అక్రమ కేసు నమోదు చేసింది. కాంగ్రెస్ సోషల్ మీడియా బృందానికి కూడా నోటీసులు ఇచ్చారు. మోదీ, అమిత్ షా, బీజేపీ నేతలు గతంలో చేసిన వ్యాఖ్యలను పరిగణనలోకి తీసుకోకుండా కేసు నమోదు చేశారు. 2000వ సంవత్సరంలో బీజేపీ ప్రధాని వాజ్పేయి, 2002లో జస్టిస్ వెంకటాచలయ్య కమిషన్ చేసిన సూచనలను బీజేపీ ప్రస్తుతం రహస్య ఎజెండాగా మార్చుకుంది. వాటి ఆధారంగా 2024 పార్లమెంటు ఎన్నికల్లో మూడింట రెండొంతుల మెజారిటీ వస్తే అమలు చేసేందుకు బీజేపీ వేసుకున్న ప్రణాళికలను మాత్రమే నేను ప్రస్తావించా. ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రతినిధిగా నేను చేస్తున్న ఆరోపణలపై తగిన సమాధానం ఇవ్వాల్సింది పోయి.. విపక్షాలపై ఈడీ, సీబీఐ, ఐటీలను ప్రయోగించిన తరహాలో నాపై ఢిల్లీ పోలీసులను ప్రయోగిస్తున్నారు.లొంగిపోతానని అనుకుంటున్నారా?ఎస్సీ, ఎస్టీ, బీసీల కోసం కొట్లాడే నేను లొంగిపోతానని ఢిల్లీ సుల్తానులు ఎలా అనుకుంటున్నారు? బీజేపీ చేస్తున్న కుట్రలను తిప్పికొట్టడానికే నేను ప్రయత్నం చేస్తున్నా. రిజర్వేషన్ల రద్దుకు సంబంధించి గతంలో పార్లమెంటులో రాష్ట్రపతి కేఆర్ నారాయణన్ ప్రసంగంలో చెప్పించడంతోపాటు, కమిషన్ నియమిస్తున్నట్టు గెజిట్ నోటిఫికేషన్ కూడా విడుదల చేశారు. వెంకటాచలయ్య కమిషన్ రాజ్యాంగాన్ని ఎలా సవరించాలో నివేదిక కూడా ఇచ్చింది. 2004లో యూపీఏ–1 అధికారంలోకి రావడంతో రాజ్యాంగాన్ని మార్చే ప్రయత్నం నిలిచిపోయింది. ఆర్ఎస్ఎస్ మూలాలున్న గోల్వాల్కర్, సిద్ధాంతకర్త ఎన్జీ వైద్య, లోక్సభ మాజీ స్పీకర్ సుమిత్రా మహాజన్, కేంద్ర మాజీ మంత్రి అనంత్కుమార్ హెగ్డే తదితరులు రిజర్వేషన్ల రద్దుపై పలు సందర్భాల్లో ప్రకటనలు కూడా చేశారు. దళితులకు హక్కులు, కుల ఆధారిత రిజర్వేషన్లు అవసరం లేదని.. రిజర్వేషన్లు రద్దు చేయాలనేది బీజేపీ ఉద్దేశంగా ఉంది. బీసీలకు 27శాతం రిజర్వేషన్లు కల్పించాలనే మండల్ కమిషన్ సిఫారసు అమలుకు వీపీ సింగ్ ప్రభుత్వం ప్రయత్నిస్తే.. అద్వానీ నేతృత్వంలో బీజేపీ, ఆర్ఎస్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున ఉద్యమం చేశాయి. ఆ రిజర్వేషన్లు న్యాయ సమ్మతమేనని, అయితే 50 శాతానికి మించకూడదని సుప్రీంకోర్టు చెప్పింది. ఆ 50శాతం పరిమితిని తొలగించాలంటే.. బీసీ జనాభాను లెక్కించాలన్న కోర్టు సూచన మేరకే భారత్ జోడో యాత్రలో రాహుల్గాంధీ కుల గణనకు హామీ ఇచ్చారు. తెలంగాణలో బీసీ జన గణన కోసం మా ప్రభుత్వం నిధులు కూడా కేటాయించింది.రిజర్వేషన్ల రద్దుకు ప్రణాళికలుకాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన చోట కులగణన చేస్తామనే విధానం తీసుకోవడంతో బీజేపీ అప్రమత్తమైంది. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు పెంచుతుందనే ఉద్దేశంతో లోక్సభలో మూడింట రెండొంతుల మెజారిటీ కోసం ప్రయత్నిస్తోంది. మరోవైపు పార్టీలను చీల్చి ఎనిమిది రాష్ట్రాల్లో ప్రభుత్వాలను ఏర్పాటు చేసుకుంది. 17వ లోక్సభలో ఆర్టికల్ 370రద్దు, సీఏఏ అమలు వంటి ఆర్ఎస్ఎస్ ఎజెండాను పూర్తి చేసింది. 18వ లోక్సభలో హిందూ దేశంగా భారత్, రిజర్వేషన్ల రద్దుకు ప్రణాళికాబద్ధంగా అడుగులు వేస్తోంది. ఈ విషయాలను ప్రస్తావించినందునే కేంద్ర ప్రభుత్వం నాపై నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేసింది. అమిత్ షా నియంత్రణలో పనిచేసే ఢిల్లీ పోలీసులను ప్రయోగించి, నాపై ఒత్తిడి తెచ్చి ఎన్నికల ప్రచారంలో పాల్గొనకుండా కుట్ర జరుగుతోంది.ఎటువైపు నిలవాలో తేల్చుకోండిబీజేపీకి వేసే ప్రతీ ఓటు ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్ల రద్దుకు దారితీస్తుంది. ప్రస్తుత ఎన్నికలు సంక్షేమం, అభివృద్ధి చుట్టూ జరగడం లేదు. రాజ్యాంగాన్ని మార్చాలా, వద్దా అనే అంశం చుట్టూనే తిరుగుతోంది. ఈ నేపథ్యంలో ఎటువైపు నిలబడాలో దళితులు, గిరిజనులు, బీసీలు, మైనారిటీలు తేల్చుకోవాలి. పోలీసులతో బెదిరించాలని మోదీ, అమిత్ షా చూస్తే అది కుదరని పని. గతంలో రిజర్వేషన్లు రద్దు చేయాలనే బీజేపీ ఆలోచనల అమలుకు రాజ్యాంగ పరిమితులు అడ్డుపడ్డాయి. అందుకే ఇప్పుడు 400 సీట్ల కోసం అరాచకాలు, అభ్యర్థులను భయపెట్టి ఏకగ్రీవం చేసుకుంటున్నారు..’’ అని రేవంత్ ఆరోపించారు.అభివృద్ధి కోరితే.. ‘గాడిద గుడ్డు’ ఇచ్చింది– కేంద్ర ప్రభుత్వంపై ‘ఎక్స్’ వేదికగా సీఎం రేవంత్రెడ్డి వ్యంగ్యాస్త్రాలుకేంద్రంలో పదేళ్లు అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం.. తెలంగాణకు గాడిద గుడ్డు ఇచ్చిందంటూ సీఎం రేవంత్రెడ్డి ‘ఎక్స్’ వేదికగా వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ‘‘పాలమూరు–రంగారెడ్డికి జాతీయ హోదా అడిగితే బీజేపీ ప్రభుత్వం గాడిద గుడ్డు ఇచ్చింది. రాష్ట్రానికి రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ, కృష్ణా, గోదావరి నదుల్లో వాటాల పంపకం, మేడారం సమ్మక్క–సారక్క జాతరకు జాతీయహోదా వంటివి అడిగితే గాడిద గుడ్డు ఇచ్చింది. మొత్తంగా ‘తెలంగాణ అభివృద్ధికి బీజేపీ ప్రధాన అడ్డు.. పదేండ్ల మోదీ పాలనలో తెలంగాణకు ఇచ్చింది పెద్ద గాడిద గుడ్డు’’ అని పోస్ట్ చేశారు. -
సుల్తాన్పూర్ లోక్సభ స్థానానికి మేనకా గాంధీ నామినేషన్ దాఖలు
లక్నో : ఉత్తర్ ప్రదేశ్ సుల్తాన్ పుర్ లోక్సభ బీజేపీ అభ్యర్ధి మేనకా గాంధీ నామినేషన్ దాఖలు చేశారు. జిల్లా ఎన్నికల అధికారి క్రితికా జోత్నకు నామినేషన్ ప్రతాలు అందించారు. నామినేషన్ దాఖలు సమయంలో ఎన్డీఏ కూటమి పార్టీలు నిషాద్ పార్టీ అధ్యక్షుడు సంజయ్ నిషాద్, అప్నాదల్ నేత, కేబినెట్ మంత్రి అశిష్ పటేల్లు ఆమె వెంట ఉన్నారు.నామినేషన్ దాఖలు చేసిన అనంతరం మేనకా గాంధీ మాట్లాడుతూ.. గత ఐదేళ్ల చేసిన అభివృద్ది కంటే వచ్చే ఐదేళ్లలో మరిన్ని అభివృద్ది కార్యక్రమాలకు శ్రీకారం చుడతామని తెలిపారు. లోక్సభ నియోజకవర్గాన్ని అభివృద్దిలో మరింత ముందుకు తీసుకెళ్లాలి. ఇక్కడి ప్రజలకు ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద మరిన్ని ఇళ్లను అందించాలని కోరుకుంటున్నామని అన్నారు.ప్రతిపక్షాల ఆరోపణలపైబీజేపీ అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మారుస్తుందంటూ ప్రతిపక్షాల ఆరోపణలపై మేనకా గాంధీ ఖండించారు. కాంగ్రెస్ కంచుకోట రాయ్ బరేలీలో బీజేపీ నుంచి తన కుమారుడు వరుణ్ గాంధీ పోటీ చేస్తారన్న ఊహాగానాలపై వ్యాఖ్యానించేందుకు ఆమె నిరాకరించారు.వరుణ్ గాంధీకి నో టికెట్వరుణ్ గాంధీ ఇటీవల గతంలో ఎన్నడూ లేనివిధంగా సొంత ప్రభుత్వంపైనే విమర్శలు గుప్పించారు. ప్రభుత్వ విధానాలపై ప్రశ్నలు లేవనెత్తారు. ఈ క్రమంలో పిలిభిత్ లోక్సభ టికెట్ను బీజేపీ నిరాకరించింది. జితిన్ ప్రసాదకు అప్పగించింది.2009 లోక్సభ ఎన్నికల్లో వరుణ్ గాంధీ తొలిసారిగా పిలిభిత్ నుంచి ఎంపీ అయ్యారు. 2014లో బీజేపీ ఆయనను సుల్తాన్పూర్ నుంచి బరిలోకి దిపింది. అక్కడ ఆయన గెలుపొందారు. మళ్లీ 2019లో మళ్లీ పిలిభిత్ స్థానం నుంచి పోటీ చేసి మళ్లీ ఎంపీగా విజయం సాధించారు. -
చంద్రబాబు అబద్దాల మేనిఫెస్టోకు మోదీ గ్యారంటీ కాదు..
చంద్రబాబు అబద్దాల మేనిఫెస్టోకు మోదీ గ్యారంటీ కాదు.. -
ఈసారి ఓటు మార్పు కోసమే
మెయిన్పురి: ఈ లోక్సభ ఎన్నికల్లో ప్రజలు కచ్చితంగా మార్పు కోసమే ఓటేస్తారని సమాజ్వాదీ పార్టీ నాయకురాలు డింపుల్ యాదవ్ ధీమా వెలిబుచ్చారు. మెయిన్పురి లోక్సభ స్థానం నుంచి పోటీ చేస్తున్న ఆమె ప్రచార పర్వంలో బిజీగా ఉన్నారు. మంగళవారం ఉత్తరప్రదేశ్లోని స్వగ్రామం సైఫైలో పీటీఐ ప్రత్యేక ముఖాముఖిలో పలు అంశాలపై డింపుల్ తన మనోగతాన్ని ఇలా పంచుకున్నారు... బీజేపీపై.. బీజేపీ పూర్తిగా ఓటు బ్యాంక్ రాజకీయాల్లో మునిగిపోయింది. కులాల లెక్కన జనాన్ని విడగొడుతోంది. జనం మనోభావాలతో ఆడుకుంటోంది. కీలక సమస్యల నుంచి జనం దృష్టి మరల్చుతోంది. బీజేపీ రాజకీయ ఒత్తిళ్లతో అన్ని వర్గాల ప్రజలు విసిగిపోయారు. విభజన రాజకీయాలతో వర్గాల మధ్య చిచ్చుపెట్టి పబ్బం గడుపుకుంటోందని వారికి తెలిసొచి్చంది. అందుకే కేంద్రంలో ఈసారి అధికార మార్పు కోసమే జనం ఓటేస్తారు.దర్యాప్తు సంస్థలు, ధరలపై.. ఈడీ, సీబీఐ, ఐటీ ఇలా ప్రతి దర్యాప్తు సంస్థనూ కేంద్రంలోని బీజేపీ సర్కార్ దురి్వనియోగం చేసింది. ఉత్తరప్రదేశ్లో జిల్లా స్థాయిలోనూ యోగి ఆదిత్యనాథ్ సర్కార్ జనాన్ని పీడిస్తోంది. ద్రవ్యోల్బణం విజృంభిస్తోంది. ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు జనాలకు చేరట్లేవు. వాగ్దానాలైతే జోరుగా చేస్తున్నారుగానీ క్షేత్రస్థాయిలో వాటి అమలు అస్సలు కనిపించట్లేదు. దేశాన్ని బీజేపీ ఎటువైపు తీసుకెళ్తుందో అందరికీ తెలుసు. పోషకాహార లోపం, ఆకలి చావుల రేటింగ్స్, గ్లోబల్ ర్యాంకింగ్స్లో భారత్ స్థానం ఏటికేడు దిగజారుతోంది. మళ్లీ బీజేపీ గెలిస్తే దేశం 15 ఏళ్లు తిరోగమనంలోకి వెళ్లడం ఖాయం. దేశ భవిష్యత్తును కాపాడుకోవాల్సిన తరుణంలో వచ్చిన ఎన్నికలివి.మోదీ మంగళసూత్రం వ్యాఖ్యలపై ఇదొక్కటే వాళ్లకు ఆయుధంగా దొరికింది. జనం భవితకు సంబంధించిన ఏ అంశమూ బీజేపీకి పట్టదు. యూపీలో మొత్తం 80 సీట్లు గెలిచేస్తామని అబద్ధాలు చెబుతున్నారు. అందులో నిపుణులు వాళ్లు. కానీ వాళ్ల మాటలను ఈసారి జనం నమ్మట్లేరు. గట్టి గుణపాఠమే చెప్తారు. అత్యంత అవినీతి నేతలను బీజేపీ లాగేసి డ్రై క్లీనింగ్ మెషీన్లో పడేస్తోంది. అంతా రాజకీయ లబ్దికోసమే చేస్తుంది. గెలుపు మెజారిటీ తగ్గడంపై.. మామ ములాయం సింగ్ యాదవ్ కాలం నుంచి చూస్తే భారీ మెజారిటీ అనేది తగ్గడం వాస్తవమే. 2019లో ఆ మెజారిటీ కేవలం 94000కు తగ్గింది. ఎన్నికలు ఎప్పుడూ ఒకేలా జరగవు. ప్రతిసారీ గెలుపును వేర్వేరు కారణాలు ప్రభావితం చేస్తాయి. తన ప్రచార సరళిపై.. రోజుకు ఎనిమిది, తొమ్మిది మీటింగ్లలో పాల్గొంటున్నా. విపక్షాల ‘ఇండియా’ కూటమికి జనం నుంచి వస్తున్న స్పందన అద్భుతం. నా కూతురు అదితి యాదవ్ సైతం తొలిసారిగా ప్రచారంలో పాల్గొంటోంది. గ్రామాలకు వెళ్తూ వారిని కలుస్తోంది. ములాయం మరణంతో వెల్లువెత్తిన సానుభూతి కారణంగానే 2022 మెయిన్పురి ఉపఎన్నికల్లో 2.8 లక్షల భారీ మెజారిటీతో ఎస్పీ గెలిచిందన్న బీజేపీ వ్యాఖ్యల్లో నిజంలేదు. జనం మనసుల్లో మేమే ఉన్నాం. ఈసారీ గెలుపు మాదే. ఆర్మీలో పనిచేస్తున్న యువతతోపాటు వృద్ధులు, మహిళలు అంతా బీజేపీ వాగ్దానాలను నెరవేర్చలేదన్న నిస్పృహలో ఉన్నారు. -
అప్పుడలా.. ఇప్పుడిలా..
పింఛను లబ్ధిదారుల్లో ఇప్పటికే బ్యాంకు ఖాతా ఉన్న వారు ఎవరైతే ఉన్నారో వారందరికీ పింఛను డబ్బులు నేరుగా వారి ఖాతాల్లోకి జమచేయాలి. సచివాలయాల దాకా వెళ్లి పింఛన్లు తీసుకోలేని వారికి మినహాయింపులు ఇవ్వొచ్చు. అలాంటి వారికి ఇంటి దగ్గరకు వెళ్లి ఇవ్వడానికి మా సిటిజన్ ఫర్ డెమోక్రసీకి అభ్యంతరంలేదు. ఇక బ్యాంకు అకౌంట్లులేని వారు సచివాలయంలో పింఛను డబ్బులు తీసుకునే అవకాశం కల్పించాలని ఈసీ అధికారులను కోరాం.– చంద్రబాబు నమ్మినబంటు మాజీ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ 20 రోజుల క్రితం కేంద్ర ఎన్నికల సంఘం అధికారులను కలిసిన తర్వాత మీడియాతో అన్న మాటలు.తాము 2024 మార్చి 30న పేర్కొన్న ఆదేశాల ప్రకారం.. బ్యాంకు ఖాతాలున్న లబ్ధిదారులకు డీబీటీ (బ్యాంకు ఖాతాలో జమచేసే) విధానంలో పింఛన్ల పంపిణీకే ప్రాధాన్యత ఇవ్వండి. లేదంటే శాశ్వత ఉద్యోగుల ద్వారా పంపిణీ చేపట్టండి. – ఏప్రిల్ 26న కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి జారీచేసిన ఆదేశాల సారాంశం ఇది. ఏప్రిల్లో దివ్యాంగులకు ఇళ్లవద్దే.. మిగిలిన వారికి గ్రామ, వార్డు సచివాలయాల వద్ద పంపిణీ కొనసాగించడంపైనా టీడీపీ–బీజేపీ–జనసేన నేతలు 20 రోజులుగా రోజూ ఫిర్యాదులు చేయడంతో ఈసీ జారీచేసిన ఆదేశాలివి.టీడీపీ–బీజేపీ–జనసేన నేతల వరుస ఫిర్యాదులతో మే ఒకటి నుంచి చేపట్టే పింఛన్ల పంపిణీ డీబీటీ విధానంలో అమలుకు ప్రాధాన్యత ఇవ్వాలని కేంద్ర ఎన్నికల సంఘమే స్పష్టంగా ఆదేశాలు జారీచేసిన నేపథ్యంలో బ్యాంకు ఖాతాలున్న 75 శాతం మంది పింఛనర్లకు బ్యాంకు ఖాతాల్లోనే పింఛన్ల జమకు అధికారులు నిర్ణయించారు. రాష్ట్రంలో జగన్మోహన్రెడ్డి సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత గత 58 నెలలుగా ప్రతినెలా ఠంఛన్గా ఒకటో తేదీనే వలంటీర్ల ద్వారా కొనసాగుతున్న పింఛన్ల పంపిణీని నెలరోజుల క్రితం అడ్డుకున్న విషయం తెలిసిందే. మళ్లీ ఇప్పుడు గ్రామ, వార్డు సచివాలయాల వద్ద కూడా ఆ పంపిణీ కొనసాగకూడదంటూ రోజూ అదేపనిగా ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు చేసి, మళ్లీ అవ్వాతాతలు తనపై ఎక్కడ ఆగ్రహం చూపుతారోనని భయంతో ‘పండుటాకులను బ్యాంకుల చుట్టూ తిప్పిస్తారా’ అంటూ చంద్రబాబు ఎప్పటిలాగే ప్లేటు ఫిరాయించారు. నిజానికి.. మొదటినుంచీ చంద్రబాబుది ఇదే తరహా రాజకీయం. ఏ అంశంపైనైనా ముందు తప్పుచేసేసి దాన్ని సరిదిద్దుకునేందుకు ఎదుటివారిపై బురదజల్లుతూ రెండు నాల్కల ధోరణి అవలంబిస్తారు. రాష్ట్ర విభజన సమయంలో.. ప్రత్యేక హోదా తదితర అంశాల విషయంలో ఆయన అనేకమార్లు బొక్కబోర్లాపడినా తనదే పైచేయి అని బిల్డప్ ఇచ్చే రకం. ఎన్నికల కోడ్ను అడ్డంపెట్టుకుని వలంటీర్లపై చంద్రబాబు అవలంబించిన వైఖరి కూడా అచ్చం ఇలాంటిదే. నెలరోజుల క్రితం..నిజానికి.. నాలుగున్నరేళ్లకు పైగా రాష్ట్రంలో వలంటీర్ల ఆధ్వర్యంలో ప్రతినెలా ఠంఛనుగా లబ్ధిదారుల ఇంటి వద్దనే పింఛన్ల పంపిణీ కొనసాగగా.. ఈ వర్గానికి చెందిన ఓట్లు టీడీపీకి దక్కవేమోనన్న దుగ్థతో ఎన్నికల నేపథ్యంలో ఈ విధానంపై పచ్చముఠా ఇప్పుడు వరుసపెట్టి ఫిర్యాదులు చేసింది. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు స్వయంగా ఈ ఏడాది మార్చి ఒకటిన ఢిల్లీలోని కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. అలాగే, చంద్రబాబు జేబులోని మనిషి, ఆయన సొంత సామాజికవర్గానికి చెందిన నిమ్మగడ్డ రమేష్కుమార్ అయితే సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ సంస్థ పేరుతో అచ్చం ఇదే పనిమీద ఉన్నారు. ఈ ఏడాది ఫిబ్రవరి 23, 25 తేదీల్లో పింఛన్ల పంపిణీలో వలంటీర్లను దూరంగా ఉంచాలని రెండుసార్లు ఫిర్యాదు చేశారు. దీంతో అప్పటివరకు ఇళ్లవద్దే ఇస్తున్న పింఛన్ల పంపిణీకి బ్రేకులు పడ్డాయి. ఫలితంగా.. ఏప్రిల్ నెల దివ్యాంగులు, కదలలేని స్థితిలో ఉండే అవ్వాతాతలకు ఇబ్బందిలేకుండా వారికి ఇంటివద్దే పింఛన్లను పంపిణీ చేసి, మిగిలిన వారికి సమీపంలోని గ్రామ, వార్డు సచివాలయాల వద్ద పంపిణీ చేశారు. ఈ నిర్ణయంపై పింఛనర్లు తీవ్రస్థాయిలో రగిలిపోయారు. చంద్రబాబు, ఆయన ముఠా తీరుపై బహిరంగంగానే విరుచుకుపడ్డారు. ఆగని ఫిర్యాదులు..చంద్రబాబు ముఠా కోరుకున్నట్లుగా తీసుకున్న ఈ పింఛన్ల పంపిణీ నిర్ణయం ఆయనకే బెడిసికొట్టింది. అనుకున్నదొకటి.. అయినదొక్కటి బోల్తాకొట్టిందిరో బాబు పిట్ట అన్నట్లుగా తయారైంది ఆయన పరిస్థితి. దీంతో తన సహజ లక్షణమైన యూటర్న్ను తీసేసుకున్నారు. అంతే.. మళ్లీ గత నెలరోజులుగా టీడీపీ–జనసేన–బీజేపీతో కూడా పచ్చబ్యాచ్ ఉమ్మడిగా కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదుల పరంపర కొనసాగించింది. ఇందులో భాగంగానే నిమ్మగడ్డ 20 రోజుల క్రితం మళ్లీ ఎన్నికల సంఘం అధికారులను కలిసి, పింఛన్ల పంపిణీ సచివాలయాల వద్ద కాకుండా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లోనే జమచేయాలని కోరారు. ఇలా దాదాపు రోజు మార్చి రోజు కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు చేస్తూ వచ్చారు. మరోపక్క.. తమ అనుకూల మీడియాలో రాష్ట్ర ఉన్నతాధికారులను బ్లాక్మెయిల్ చేసేలా నిత్యం కథనాలు రాయించి బ్యాంకుల ద్వారా పింఛన్లను పంపిణీ చేసే పరిస్థితి తీసుకొచ్చారు. సెలవైనా ఒకటినే బ్యాంకులో పింఛను..మేడే కారణంగా బ్యాంకులకు సెలవు అయినప్పటికీ రాష్ట్రవ్యాప్తంగా 65,49,864 మంది లబ్ధిదారులకు ఒకటో తేదీనే పింఛను డబ్బులను అందుబాటులో ఉంచుతూ రాష్ట్ర ప్రభుత్వం రూ.1,945.39 కోట్లు విడుదలచేసింది. విభిన్న దివ్యాంగ వర్గానికి చెందిన లబ్ధిదారులతో పాటు తీవ్రమైన అనారోగ్యాల కారణంగా పింఛన్లు పొందుతున్న వారు, మంచం లేదా వీల్చైర్లకు పరిమితమయ్యే 16,57,361 మందికి ఒకటో తేదీ (బుధవారం) ఉదయం నుంచే గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులు పంపిణీ చేపట్టేలా మంగళవారమే వారికి సంబంధించిన రూ.474.17 కోట్లను గ్రామ, వార్డు సచివాలయాల వారీగా బ్యాంకు ఖాతాల్లో జమచేసినట్లు అధికారులు వెల్లడించారు. మిగిలిన 48,92,503 మంది లబ్ధిదారుల పింఛన్ డబ్బులు బుధవారం బ్యాంకులకు సెలవు అయినప్పటికీ అదేరోజు ఉ.8 గంటల నుంచి వారి ఖాతాల్లో జమయ్యేలా అన్ని బ్యాంకులు చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు.– సాక్షి, అమరావతి
Related News by category
-
బీజేపీ ఎజెండా రిజర్వేషన్ల రద్దే..: సీఎం రేవంత్రెడ్డి
సాక్షి, హైదరాబాద్: రిజర్వేషన్లను రద్దు చేయడమే ఆర్ఎస్ఎస్ మూల సిద్ధాంత మని, దాన్ని అమలు చేయడమే బీజేపీ ఎజెండా అని సీఎం రేవంత్రెడ్డి ఆరోపించారు. రాజ్యాంగాన్ని మార్చేందుకు బీజేపీ వేసుకున్న ప్రణాళికలను మాత్రమే తాను ప్రస్తావించానని.. ఆధా రాలతో సహా తాను చెప్తున్న అంశాలపై కేంద్రం వివరణ ఇవ్వడంగానీ, సవరించుకోవడం గానీ చేయాలని స్పష్టం చేశా రు. రేవంత్రెడ్డి బుధవారం సాయంత్రం తన నివాసంలో మీడి యాతో మాట్లాడారు. వివరాలు ఆయన మాటల్లోనే..‘‘సమయం, సందర్భం, అవకాశం వచ్చిన ప్రతీ సందర్భంలో రాజ్యాంగాన్ని మార్చి ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్లను రద్దు చేయాలనే ఎజెండాతోనే బీజేపీ పనిచేస్తోంది. ఆ విషయాన్నే నేను ప్రస్తావించడంతో దేశవ్యాప్తంగా చర్చ జరుగు తోంది. తమ ఎన్నికల ప్రయోజనాలకు దెబ్బతగులుతుందనే భయంతో కప్పి పుచ్చుకునేందుకు బీజేపీ ప్రయత్నిస్తోంది. అందులో భాగంగానే కేంద్ర హోంశాఖ ఫిర్యాదు చేసి నాపై అక్రమ కేసు నమోదు చేసింది. కాంగ్రెస్ సోషల్ మీడియా బృందానికి కూడా నోటీసులు ఇచ్చారు. మోదీ, అమిత్ షా, బీజేపీ నేతలు గతంలో చేసిన వ్యాఖ్యలను పరిగణనలోకి తీసుకోకుండా కేసు నమోదు చేశారు. 2000వ సంవత్సరంలో బీజేపీ ప్రధాని వాజ్పేయి, 2002లో జస్టిస్ వెంకటాచలయ్య కమిషన్ చేసిన సూచనలను బీజేపీ ప్రస్తుతం రహస్య ఎజెండాగా మార్చుకుంది. వాటి ఆధారంగా 2024 పార్లమెంటు ఎన్నికల్లో మూడింట రెండొంతుల మెజారిటీ వస్తే అమలు చేసేందుకు బీజేపీ వేసుకున్న ప్రణాళికలను మాత్రమే నేను ప్రస్తావించా. ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రతినిధిగా నేను చేస్తున్న ఆరోపణలపై తగిన సమాధానం ఇవ్వాల్సింది పోయి.. విపక్షాలపై ఈడీ, సీబీఐ, ఐటీలను ప్రయోగించిన తరహాలో నాపై ఢిల్లీ పోలీసులను ప్రయోగిస్తున్నారు.లొంగిపోతానని అనుకుంటున్నారా?ఎస్సీ, ఎస్టీ, బీసీల కోసం కొట్లాడే నేను లొంగిపోతానని ఢిల్లీ సుల్తానులు ఎలా అనుకుంటున్నారు? బీజేపీ చేస్తున్న కుట్రలను తిప్పికొట్టడానికే నేను ప్రయత్నం చేస్తున్నా. రిజర్వేషన్ల రద్దుకు సంబంధించి గతంలో పార్లమెంటులో రాష్ట్రపతి కేఆర్ నారాయణన్ ప్రసంగంలో చెప్పించడంతోపాటు, కమిషన్ నియమిస్తున్నట్టు గెజిట్ నోటిఫికేషన్ కూడా విడుదల చేశారు. వెంకటాచలయ్య కమిషన్ రాజ్యాంగాన్ని ఎలా సవరించాలో నివేదిక కూడా ఇచ్చింది. 2004లో యూపీఏ–1 అధికారంలోకి రావడంతో రాజ్యాంగాన్ని మార్చే ప్రయత్నం నిలిచిపోయింది. ఆర్ఎస్ఎస్ మూలాలున్న గోల్వాల్కర్, సిద్ధాంతకర్త ఎన్జీ వైద్య, లోక్సభ మాజీ స్పీకర్ సుమిత్రా మహాజన్, కేంద్ర మాజీ మంత్రి అనంత్కుమార్ హెగ్డే తదితరులు రిజర్వేషన్ల రద్దుపై పలు సందర్భాల్లో ప్రకటనలు కూడా చేశారు. దళితులకు హక్కులు, కుల ఆధారిత రిజర్వేషన్లు అవసరం లేదని.. రిజర్వేషన్లు రద్దు చేయాలనేది బీజేపీ ఉద్దేశంగా ఉంది. బీసీలకు 27శాతం రిజర్వేషన్లు కల్పించాలనే మండల్ కమిషన్ సిఫారసు అమలుకు వీపీ సింగ్ ప్రభుత్వం ప్రయత్నిస్తే.. అద్వానీ నేతృత్వంలో బీజేపీ, ఆర్ఎస్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున ఉద్యమం చేశాయి. ఆ రిజర్వేషన్లు న్యాయ సమ్మతమేనని, అయితే 50 శాతానికి మించకూడదని సుప్రీంకోర్టు చెప్పింది. ఆ 50శాతం పరిమితిని తొలగించాలంటే.. బీసీ జనాభాను లెక్కించాలన్న కోర్టు సూచన మేరకే భారత్ జోడో యాత్రలో రాహుల్గాంధీ కుల గణనకు హామీ ఇచ్చారు. తెలంగాణలో బీసీ జన గణన కోసం మా ప్రభుత్వం నిధులు కూడా కేటాయించింది.రిజర్వేషన్ల రద్దుకు ప్రణాళికలుకాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన చోట కులగణన చేస్తామనే విధానం తీసుకోవడంతో బీజేపీ అప్రమత్తమైంది. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు పెంచుతుందనే ఉద్దేశంతో లోక్సభలో మూడింట రెండొంతుల మెజారిటీ కోసం ప్రయత్నిస్తోంది. మరోవైపు పార్టీలను చీల్చి ఎనిమిది రాష్ట్రాల్లో ప్రభుత్వాలను ఏర్పాటు చేసుకుంది. 17వ లోక్సభలో ఆర్టికల్ 370రద్దు, సీఏఏ అమలు వంటి ఆర్ఎస్ఎస్ ఎజెండాను పూర్తి చేసింది. 18వ లోక్సభలో హిందూ దేశంగా భారత్, రిజర్వేషన్ల రద్దుకు ప్రణాళికాబద్ధంగా అడుగులు వేస్తోంది. ఈ విషయాలను ప్రస్తావించినందునే కేంద్ర ప్రభుత్వం నాపై నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేసింది. అమిత్ షా నియంత్రణలో పనిచేసే ఢిల్లీ పోలీసులను ప్రయోగించి, నాపై ఒత్తిడి తెచ్చి ఎన్నికల ప్రచారంలో పాల్గొనకుండా కుట్ర జరుగుతోంది.ఎటువైపు నిలవాలో తేల్చుకోండిబీజేపీకి వేసే ప్రతీ ఓటు ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్ల రద్దుకు దారితీస్తుంది. ప్రస్తుత ఎన్నికలు సంక్షేమం, అభివృద్ధి చుట్టూ జరగడం లేదు. రాజ్యాంగాన్ని మార్చాలా, వద్దా అనే అంశం చుట్టూనే తిరుగుతోంది. ఈ నేపథ్యంలో ఎటువైపు నిలబడాలో దళితులు, గిరిజనులు, బీసీలు, మైనారిటీలు తేల్చుకోవాలి. పోలీసులతో బెదిరించాలని మోదీ, అమిత్ షా చూస్తే అది కుదరని పని. గతంలో రిజర్వేషన్లు రద్దు చేయాలనే బీజేపీ ఆలోచనల అమలుకు రాజ్యాంగ పరిమితులు అడ్డుపడ్డాయి. అందుకే ఇప్పుడు 400 సీట్ల కోసం అరాచకాలు, అభ్యర్థులను భయపెట్టి ఏకగ్రీవం చేసుకుంటున్నారు..’’ అని రేవంత్ ఆరోపించారు.అభివృద్ధి కోరితే.. ‘గాడిద గుడ్డు’ ఇచ్చింది– కేంద్ర ప్రభుత్వంపై ‘ఎక్స్’ వేదికగా సీఎం రేవంత్రెడ్డి వ్యంగ్యాస్త్రాలుకేంద్రంలో పదేళ్లు అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం.. తెలంగాణకు గాడిద గుడ్డు ఇచ్చిందంటూ సీఎం రేవంత్రెడ్డి ‘ఎక్స్’ వేదికగా వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ‘‘పాలమూరు–రంగారెడ్డికి జాతీయ హోదా అడిగితే బీజేపీ ప్రభుత్వం గాడిద గుడ్డు ఇచ్చింది. రాష్ట్రానికి రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ, కృష్ణా, గోదావరి నదుల్లో వాటాల పంపకం, మేడారం సమ్మక్క–సారక్క జాతరకు జాతీయహోదా వంటివి అడిగితే గాడిద గుడ్డు ఇచ్చింది. మొత్తంగా ‘తెలంగాణ అభివృద్ధికి బీజేపీ ప్రధాన అడ్డు.. పదేండ్ల మోదీ పాలనలో తెలంగాణకు ఇచ్చింది పెద్ద గాడిద గుడ్డు’’ అని పోస్ట్ చేశారు. -
ఈవీఎంలపై మమతా బెనర్జీ సంచలన ఆరోపణలు
కోల్కతా: లోక్సభ ఎన్నికల తొలి రెండు దశల పోలింగ్ శాతంపై మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు చేశారు. పశ్చిమబెంగాల్లో బుధవారం(మే1) జరిగిన ఎన్నికల ప్రచార సభలో మమత ప్రసంగించారు. తొలి రెండు దశల పోలింగ్ ముగిసినపుడు ఒకటి ప్రకటించి తర్వాత ఏకంగా 5.75 శాతం పోలింగ్ పెరిగిందని ఎన్నికల కమిషన్(ఈసీ) ప్రకటించడమేంటని ప్రశ్నించారు. బెంగాల్లో జేపీకి ప్రతికూలంగా ఉన్న చోట్లలోనే పోలింగ్ శాతం పెరిగిందని చెప్పారు. పోలింగ్ శాతం ఒక్కసారిగా పెరగడంతో ఈవీఎంల విశ్వసనీయతపై అనుమానాలు వస్తున్నాయన్నారు. ఎన్నికల్లో గెలవడానికి బీజేపీ ఎంతకైనా దిగజారుతుందని ఆరోపించారు.పశ్చిమబెంగాల్లో సీపీఎం, కాంగ్రెస్లకు ఓటు వేయొద్దని మమత పిలుపునిచ్చారు. ఆ రెండు పార్టీలు బీజేపీ ఏజెంట్లేనన్నారు. టీఎంసీ ఓట్లు చీల్చి బీజేపీని గెలిపించడానికి ఆ పార్టీలు ప్రయత్నిస్తున్నాయని మండపపడ్డారు. -
బీఆర్ఎస్కు ఎదురు దెబ్బ : కాంగ్రెస్లో చేరిన ఇంద్రకరణ్ రెడ్డి
హైదరాబాద్,సాక్షి : పార్లమెంట్ ఎన్నికల తరుణంలో బీఆర్ఎస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. బీఆర్ఎస్కు రాజీనామా చేసిన మాజీ మంత్రి ఇంద్ర కరణ్ రెడ్డి కాంగ్రెస్లో చేరారు. గాంధీ భవన్లో కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇంఛార్జి దీపా దాస్ మున్షీ ఆధ్వర్యంలో పార్టీ కండువా కప్పుకున్నారు. గాంధీ భవన్ లో ఏఐసీసీ ఇంచార్జ్ దీపా దాస్ మున్శి సమక్షంలో కాంగ్రెస్ పార్టీ లో చేరిన మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి.Former minister Indrakaran Reddy joined the Congress party in the presence of AICC in-charge Deepa Das Munshi at Gandhi Bhavan.• @IKReddyAllola pic.twitter.com/3JdkBWPBFA— Congress for Telangana (@Congress4TS) May 1, 2024 -
సీఎం రేవంత్పై ’ఈసీ‘కి బీఆర్ఎస్ ఫిర్యాదు
సాక్షి,హైదరాబాద్: సీఎం రేవంత్రెడ్డిపై చర్యలు తీసుకోవాలని తెలంగాణ ఎన్నికల ప్రధాన అధికారి(సీఈవో)ను బీఆర్ఎస్ నేతలు కోరారు. ఈ మేరకు రేవంత్రెడ్డిపై సీఈవోకు బీఆర్ఎస్ నేతలు బుధవారం(మే1) ఫిర్యాదు చేశారు. ప్రతిపక్షనేత బీఆర్ఎస్పై సీఎం రేవంత్రెడ్డి తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఉస్మానియా పవర్ కట్ ఘటనను ఉదాహరిస్తూ రేవంత్రెడ్డిపై బీఆర్ఎస్పై తప్పుడు ఆరోపణలు చేశారని తెలిపారు. కాగా, కాం గ్రెస్ ఫిర్యాదుతో ఈసీ కేసీఆర్పై ఇప్పటికే చర్య తీసుకుంది. 48 గంటల పాటు ప్రచారాన్ని ఆపాలని ఆదేశించింది. -
ఈసీ నిషేధంపై స్పందించిన కేసీఆర్
హైదారబాద్,సాక్షి : ఎలక్షన్ కమిషన్ నోటీసులపై కేసీఆర్ స్పందించారు. తాను చేసిన వ్యాఖ్యలను అధికారులు సరిగ్గా అర్థం చేసుకోలేదని అన్నారు. స్థానిక భాషను అధికారులు అర్థం చేసుకోకుండా పై అధికారులకు నివేదికలు ఇచ్చినట్లు అర్థమవుతుందని తెలిపారు.‘కాంగ్రెస్ నేతలు నేను మాట్లాడిన కొన్ని వ్యాఖ్యలను మాత్రమే ఎంపిక చేసి ఫిర్యాదులో పేర్కొన్నారు. నేను కాంగ్రెస్ విధానాలు, హామీల అమల్లో వైఫల్యాన్నే ప్రస్తావించాను. కానీ నా మాటల్ని కాంగ్రెస్ నేతలు ట్విస్ట్ చేశారు’ అని కేసీఆర్ తెలిపారు.ఇదెక్కడి అరాచకం?కేసీఆర్ ఎన్నికల ప్రచారంపై ఈసీ నిషేధం విధించడంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. ‘ఇదెక్కడి అరాచకం? ఏకంగా కేసీఆర్ గొంతుపైనే నిషేధమా? మోదీ విద్వేష వ్యాఖ్యలు ఈసీకి వినిపించలేదా? రేవంత్ బూతులు ఈసీకి ప్రవచనాల్లాగా అనిపించాయా? బడే భాయ్.. చోటే భాయ్ కలిసి చేసిన కుట్ర కాదా ఇది! అంటూ ట్వీట్ చేశారు. ఇదెక్కడి అరాచకం...? ఏకంగా Telangana ki Awaaz KCR గొంతు పైనే నిషేధమా..?మోడీ విద్వేష వ్యాఖ్యలుఈసీకి వినిపించలేదా..? Zero action against Modi despite thousands of citizens’ complaints రేవంత్ బూతులు EC కిప్రవచనాల్లాగా అనిపించాయా...? No action against the foul mouthed Cheap…— KTR (@KTRBRS) May 1, 2024
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
సీఎస్కేకు బిగ్ షాకిచ్చిన పంజాబ్.. 7 వికెట్ల తేడాతో ఘన విజయం
చరిత్ర సృష్టించిన రుతురాజ్.. ధోని ఆల్టైమ్ రికార్డు బద్దలు
నేహా కుటుంబానికి అండగా అమిత్షా..
ఆ టాలీవుడ్ హీరోతో కలిసి పని చేయాలని ఉంది: అల్లరి నరేశ్
రుతురాజ్ కెప్టెన్ ఇన్నింగ్స్.. పంజాబ్ టార్గెట్ ఎంతంటే?
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ కుమార్తెకు అరుదైన గౌరవం!
వరల్డ్కప్కు సెలక్టయ్యాడు.. తొలిసారి డకౌటయ్యాడు! వీడియో వైరల్
ఈవీఎంలపై మమతా బెనర్జీ సంచలన ఆరోపణలు
ఎందుకంత ఓవరాక్షన్.. వాళ్లతో పోలిస్తే నువ్వెంత?: పూరి
వడగళ్ల వానతో దెబ్బతిన్న విమానం.. ఒడిశాలో ఎమర్జెన్సీ ల్యాండింగ్
Photos
View allVideo
View allతప్పక చదవండి
- సీఎం రేవంత్పై ’ఈసీ‘కి బీఆర్ఎస్ ఫిర్యాదు
- కాస్మొటిక్ సర్జీలు : యాక్టర్స్ విషాద మరణాలు (ఫొటోలు)
- రిలీజైన ఏడాది తర్వాత తెలుగులో పీరియాడికల్ చిత్రం!
- కేసీఆర్పై ఈసీ చర్యలు, ఎన్నికల ప్రచారంపై 48 గంటల నిషేధం
- తెలుగులో స్ట్రీమింగ్ అవుతోన్న భారీ బడ్జెట్ వెబ్ సిరీస్..!
- నా కుమారుడు వరల్డ్కప్ జట్టుకు ఎంపికవుతాడని స్వీట్లు, టపాసులు తెచ్చా: రింకూ తండ్రి ఆవేదన
- సుల్తాన్పూర్ లోక్సభ స్థానానికి మేనకా గాంధీ నామినేషన్ దాఖలు
- ‘దిశ’ ఎన్కౌంటర్ కేసు.. సిర్పూర్ కర్ కమిషన్ రిపోర్ట్పై స్టే
- జనసేన నేతలకు అవమానం.. టీడీపీ ప్రచార రథంపై నుంచి గెంటేసి..
- రాయ్బరేలీ, అమేథి స్థానాలపై 24 గంటల్లో తుది నిర్ణయం
Advertisement