ప్రచారం ఎక్కువ.. పని చేయడం తక్కువ

BJP Leader GVL Narasimha Rao Fires On TDP Government - Sakshi

సాక్షి, ఢిల్లీ : నీతి అయోగ్‌ సమావేశంలో సీఎం చంద్రబాబు నాయుడు రాష్ట్ర సమస్యలను విస్తృతంగా ప్రస్తావించారని టీడీపీ నేతలు ప్రచారం బాగానే చేసుకుంటున్నారని బీజేపీ అధికార ప్రతినిధి, ఎంపీ జీవీఎల్‌ నరసింహారావు అన్నారు. ఆయన ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. సర్వే చూసి ఆనంద పడే వారికి చుక్కలు కనిపించక మానదు అని జోస్యం చెప్పారు. బాబు చెప్పిన మాటలకు కట్టుబడి ఉండాలి.. ప్రచారాలకే పరిమితమై ప్రజల అభివృద్ధికి పనిచేయడం లేదని ఆయన విమర్శించారు. ఇక్కడ సమస్యలు లెవనెత్తుతున్నారు.. కానీ క్షేత్ర స్థాయిలో ఎందుకు పట్టించుకోవడం లేదని జీవీఎల్‌ ధ్వజమెత్తారు. 

‘కేంద్రం సహాయం చేసేందుకు సిద్ధంగా ఉన్నా ఏమీ పట్టనట్లు ఉన్నారు. స్పెషల్‌ పర్పస్‌ వాహనం ఏర్పాటు చేయమంటే ఇంతవరకూ ఎందుకు చేయలేదు. ఆర్భాటాలు, ప్రచారాలు తప్ప పనులు చేయడం లేదు. ఒకప్పుడు ప్రత్యేక హోదా కంటే ఎక్కువ నిధులు రాష్ట్రానికి వచ్చాయని మీరే పత్రికల్లో రాయించారు కదా! హోదా కంటే ప్యాకేజీ వల్లే నిధులు బాగా వచ్చాయని మీరు అన్నది నిజం కాదా? ప్రస్తుతం మీరు చేస్తున్న వార్తలు చూస్తే యూ టర్న్‌ తీసుకున్నట్లు ప్రజలకు తెలుస్తోంది ’ అని బాబు తీరుపై జీవీఎల్‌ మండిపడ్డారు.

‘పోలవరానికి రావాలిసిన నిధులు త్వరలోనే రాబోతున్నాయి. నాబార్డు ద్వారా వెంటనే నిధులు విడుదల అవుతాయని మాకు సమాచారం ఉంది. వెనకబడిన జిల్లాలకు 300 కోట్ల రూపాయల చొప్పున కేంద్రం ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సిన ప్రతి రూపాయి కేంద్రం ఇస్తూనే ఉంది. రాష్ట్ర ప్రజలకు తప్పుడు ప్రచారాలు చేయకండి. నీతి అయోగ్‌ సమావేశంలో రాష్ట్ర ముఖ్యమంత్రికి ప్రత్యేకంగా 20 నిమిషాలు మాట్లాడే అవకాశం దక్కడం గర్విస్తున్నాను. నిర్దిష్ట సమయంలో జరిగే సమావేశం కాబట్టి అందరూ సీఎంలకు కొంత సమయమే కేటాయించారు. సర్వే చూసి ఆనందం పడే వారికి చుక్కలు కనిపించక మానదు. ఒక శాతం ఓటు ఉన్న రాష్ట్రలలోనే మా ప్రభుత్వం ఏర్పాటు చేశామని’ జీవీఎల్‌ నరసింహారావు గుర్తు చేశారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top