
సాక్షి, హైదరాబాద్: పంచాయతీరాజ్ చట్ట సవరణలపై ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరిస్తోందని, దీనిపై వెంటనే అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయాలని శాసనమండలిలో కాంగ్రెస్ ఉపనేత పొంగులేటి సుధాకర్రెడ్డి మంగళవారం డిమాండ్ చేశారు.
ప్రభుత్వం దీనిని టీఆర్ఎస్ సొంత వ్యవహారంగా మార్చిందని ఆరోపించారు. అభివృద్ధికి నిలయాలుగా ఉండాల్సిన గ్రామ పంచాయతీలను టీఆర్ఎస్ కుటిల రాజకీయాలకు వేదికగా చేయాలని ప్రయత్నిస్తోందన్నారు.