సివిల్స్‌రిజర్వ్‌ జాబితాలోని 53 మందికి సర్వీస్‌

UPSC Releases New List Of Candidates To Fill Up Vacant Posts - Sakshi

జాబితాలో తెలుగువారూ..

సాక్షి, న్యూఢిల్లీ: సివిల్స్‌ ఫలితాల్లోని రిజర్వ్‌ జాబితా ప్రతిభా క్రమంలో మరో 53 మందిని అఖిల భారత సర్వీస్‌కు ఎంపిక చేస్తూ యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌(యూపీఎస్సీ) తాజాగా నిర్ణయం తీసుకుంది. సివిల్స్‌–2018 పరీక్షా ఫలితాలను యూïపీఎస్సీ ఈ ఏడాది ఏప్రిల్‌ ఐదవ తేదీన ప్రకటించడం తెలిసిందే. అందులో 759 మంది అభ్యర్థులు ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్‌ఎస్, సెంట్రల్‌ సర్వీసెస్‌ గ్రూప్‌–ఏ, గ్రూప్‌–బీ  పోస్టులకు ఎంపికయ్యారు. సివిల్‌ సర్వీస్‌ పరీక్షల నిబంధనల ప్రకారం రిజర్వ్‌ లిస్ట్‌ కూడా అందుబాటులో ఉంచుతారు. ఈ నేపథ్యంలో కేంద్ర సిబ్బంది, శిక్షణ విభాగం (డీఓపీటీ) అవసరం కోసం యూపీఎస్సీ మరో 53 మందిని అఖిల భారత సర్వీసుకు సిఫారసు చేసింది. ఫలితాలను యూపీఎస్సీ వెబ్‌సైట్‌లో కూడా పొందుపరిచారు. ఈ 53 మందిలో పలువురు తెలుగు అభ్యర్థులు కూడా ఉన్నారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top