పెళ్లి రిజిస్ట్రేషన్‌ చేసుకోవాల్సిందే.. | UP govt makes registration of marriages compulsory | Sakshi
Sakshi News home page

పెళ్లి రిజిస్ట్రేషన్‌ చేసుకోవాల్సిందే..

Aug 2 2017 12:23 PM | Updated on Aug 25 2018 4:34 PM

పెళ్లి రిజిస్ట్రేషన్‌ చేసుకోవాల్సిందే.. - Sakshi

పెళ్లి రిజిస్ట్రేషన్‌ చేసుకోవాల్సిందే..

తప్పనిసరిగా మ్యారెజ్‌ రిజిస్ట్రేషన్‌ చేసుకోవాల్సిందేనని ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం నిర్ణయించింది.

లక్నో: కుల,మత భేదం లేకుండా అందరూ తప్పనిసరిగా మ్యారెజ్‌ రిజిస్ట్రేషన్‌ చేసుకోవాల్సిందేనని ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు మంగళవారం యూపీ సీఎం యోగి ఆధిత్యనాథ్‌ కెబినేట్‌ ఈ నిర్ణయానికి ఆమోదం తెలిపింది. అయితే దేశ వ్యాప్తంగా పెళ్లి రిజిస్ట్రేషన్‌లు ఖచ్చితంగా చేయాలని 2006లోనే సుప్రీం కోర్టు సూచించింది. దేశవ్యాప్తంగా యూపీతో పాటు రెండు రాష్ట్రాల్లో మినహా అన్ని రాష్ట్రాల్లో ఈ నిబంధన అమలవుతోంది. 11 ఏళ్ల తర్వాత యూపీ ప్రభుత్వం మ్యారేజ్‌ రిజిస్ట్రేషన్‌-2017 పేరిట నిబంధనలు తీసుకొచ్చింది. పెళ్లి అయిన వెంటనే రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలని లేకుంటే జరిమానాలు విధిస్తామని పేర్కొంది. ఏడాదిలోపు రిజిస్ట్రేషన్‌ చేసుకోకుంటే రోజుకు రూ.10, ఆపై ఆలస్యం చేస్తే రూ.50ల చొప్పున పెరుగుతూ పోతుందని తెలిపింది.
 
అన్ని వర్గాలను దృష్టిలో ఉంచుకునే ఈ నిర్ణయం తీసుకున్నట్లు యూపీ వైద్య శాఖ మంత్రి సిద్దార్థ్‌ నాథ్‌ సింగ్‌ మీడియాకు తెలిపారు. కొంత మంది ముస్లింలు పెళ్లికొడుకు, పెళ్లికూతురుల ఫోటోలకు మినహాయింపు ఇవ్వాలని కోరారు. ఈ డిమాండ్‌ను ప్రభుత్వం తిరస్కరించిందని, ముస్లింల నిఖామలో ఫోటోలు లేకపోవచ్చు కానీ, ఆధార్‌ కార్టులాంటి వాటికి ఫోటోలున్నాయి కదా.. మ్యారెజ్‌ సర్టిఫికెట్‌ కూడా అలాంటిదేనని మంత్రి సిద్దార్థ్‌ స్పష్టం చేశారు. దీనికి సంబంధించి ఆన్‌లైన్‌ పోర్టల్‌ త్వరలోనే ప్రారంభిస్తామన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement