ట్రైనీ ఐఏఎస్ జీవితం విషాదాంతం | Trainee IAS officer killed in accident | Sakshi
Sakshi News home page

ట్రైనీ ఐఏఎస్ జీవితం విషాదాంతం

Nov 6 2013 4:33 PM | Updated on Apr 3 2019 7:53 PM

ఐఏఎస్ ఆఫీసర్ కావాలన్న కల సాకారమైంది. భారత అత్యున్నత సర్వీస్కు ఎంపికయ్యారు. శిక్షణ తీసుకుంటున్నారు. ఇక ఉద్యోగంలో చేరడమే తరువాయి. ఇంతలోనే అతణ్ని మృత్యువు కబళించింది.

ఐఏఎస్ ఆఫీసర్ కావాలన్న కల సాకారమైంది. భారత అత్యున్నత సర్వీస్కు ఎంపికయ్యారు. శిక్షణ తీసుకుంటున్నారు. ఇక ఉద్యోగంలో చేరడమే తరువాయి. ఇంతలోనే అతణ్ని మృత్యువు కబళించింది. తిరిగిరాని లోకాలకు తీసుకెళ్లింది. ఉన్నత శిఖరాలకు ఎదగాల్సిన ఓ ట్రైనీ ఐఏఎస్ ఆఫీసర్ జీవితం విషాదాంతంగా ముగిసింది.

పంజాబ్తో బుధవారం జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో శిక్షణలో ఉన్న ఐఏఎస్ అధికారి నిషాత్ కుమార్ మరణించారు. మోగా జిల్లాలో హైవేపై నిషాత్ ప్రయాణిస్తున్న వాహనం చెట్టుకు ఢీకొనడంతో ఈ ప్రమాదం సంభవించింది. నిషాత్ స్వరాష్ట్రం బీహార్. గాయపడ్డ ఇతర అధికారుల్ని చికిత్స నిమిత్తం మోగా, లుధియానా ఆస్పత్రులకు తరలించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement