కశ్మీర్లో మరోసారి ఉద్రిక్తత | teenager death leads to tension in kashmir | Sakshi
Sakshi News home page

కశ్మీర్లో మరోసారి ఉద్రిక్తత

Aug 31 2016 12:37 PM | Updated on Sep 4 2017 11:44 AM

కశ్మీర్లో మరోసారి ఉద్రిక్తత

కశ్మీర్లో మరోసారి ఉద్రిక్తత

భద్రతా బలగాలకు, ఆందోళనకారులకు మధ్య జరిగిన ఘర్షణలో ఓ యువకుడు మృతి చెందాడు.

శ్రీనగర్: జమ్మూకశ్మీర్ లో పరిస్థితి మళ్లీ మొదటికొచ్చింది. సోమవారం కర్ఫ్యూను తొలగిస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో.. మళ్లీ హింస చెలరేగింది. బారాముల్లా జిల్లాలో ఆందోళనకారులకు, భద్రతా బలగాలకు మధ్య జరిగిన తాజా ఘర్షణలో 18 ఏళ్ల దనిష్ అహ్మద్ మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు.

ఆందోళన కారులు నదిహల్ గ్రామం వద్ద భద్రతా బలగాలపై పెద్ద ఎత్తున రాళ్లదాడి చేశారు. దీంతో భద్రతా బలగాలు కాల్పులు జరిపాయి. ఈ కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన అహ్మద్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. కశ్మీర్ అల్లర్ల మృతుల సంఖ్య 72 కు చేరుకుంది. అహ్మద్ మరణంతో మరోసారి ఉధ్రిక్త పరిస్థితులు నెలకొనడంతో బారాముల్లా, సోపోర్ లలో మరోసారి భారీగా భద్రతా బలగాలు మోహరించాయి.

Advertisement
 
Advertisement
Advertisement