జైలు నుంచి యాసిన్ భత్కల్ ఫోన్!


న్యూఢిల్లీ: ప్రస్తుతం తీహార్ జైలు లో ఉన్న ఇండియన్ ముజాహిద్దీన్(ఐఎమ్) చీఫ్ యాసిన్ భత్కల్ ను ఐఎస్ఐఎస్, అనసర్ ఉద్-తవ్హీద్ ఫీ బిలాద్ అల్ హింద్(ఏయుటీ) సంస్థలకు చెందిన నేతలు కలిశారా? అనే వార్తలకు అవుననే! సమాధానం వినిపిస్తోంది.  జైలు నుంచి భత్కల్ తన భార్యకు  ఫోన్ చేసి మాట్లాడినట్లు ఇంటిలిజెన్స్ వర్గాల సమాచారం.



గత జూన్ లో తన భార్యతో మాట్లాడిన భత్కల్ త్వరలో దామస్కస్ నుంచి సాయం అందుతుని చెప్పినట్లు భారత ఐసిస్ రిక్రూటర్ లుగా ఉన్న ఆషీక్ అహ్మద్ అలియాస్ రాజా, మహ్మద్ అబ్దుల్ అహద్, మహమ్మద్ అఫ్జల్ లు తెలిపారు. దీంతో అలర్ట్ అయిన ఇంటిలిజెన్స్ అధికారులు భత్కల్ అరెస్టు తర్వాత ఇప్పటివరకు అతన్ని కలిసిన వారిని విచారించేందుకు సిద్ధమవుతున్నారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top