జాతీయ జెండాకు అవమానం

Shame to Indian Flag In israel While Karnataka minister Tour - Sakshi

సాక్షి బెంగళూరు: ఇజ్రాయిల్‌లో  భారత జాతీయ జెండాకు అవమానం జరిగిందని, ఆ సమయంలో అక్కడ ఉన్న కర్ణాటక మంత్రి పట్టించుకోకుండా ఉన్నారని నెటిజన్లు మండిపడుతున్నారు.  ఉద్యాన పంటలపై అధ్యయనం చేసేందుకు  ఉద్యాన మంత్రి ఎంసీ మనగోళి ఇజ్రాయిల్‌లో పర్యటిస్తున్నారు.  ఈ క్రమంలో అక్కడి పంటలపై విదేశీ అధికారులతో కలసి చర్చిస్తున్న సందర్భంలో ఎదురుగా ఉన్న టేబుల్‌పై జాతీయ జెండా తిరగేసి ఉండడాన్ని ఆయన గమనించకపోవడంపై సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top