ప‌రిస్థితి సాధార‌ణం అయ్యాకే స్కూళ్లు పునఃప్రారంభం

Schools Re-Open When Situation Is Normalized Says HRD Minister - Sakshi

న్యూఢిల్లీ : భార‌త్‌లో క‌రోనా విజృంభిస్త‌న్న నేప‌థ్యంలో స్కూళ్లు, కాలేజీలు ఇప్ప‌ట్లో తెరిచే అవ‌కాశం లేన‌ట్లు క‌నిపిస్తుంద‌ని కేంద్ర మాన‌వ వ‌న‌రుల అభివృద్ధి శాఖ మంత్రి ర‌మేష్ పోఖ్రియాల్ తెలిపారు. శుక్ర‌వారం వివిధ పాఠ‌శాల‌ల ఉపాధ్యాయుల‌తో జ‌రిపిన వీడియో కాన్ఫ‌రెన్స్‌లో మాట్లాడిన మంత్రి..పరిస్థితి అదుపులోకి వ‌చ్చాకే పాఠ‌శాల‌లు పునఃప్రారంచాల‌ని నిర్ణ‌యించిన‌ట్లు పేర్కొన్నారు. లాక్‌డౌన్ త‌ర్వాత అనుస‌రించాల్సిన విధానాల‌పై ప్రణాళిక‌లు రూపొందిస్తున్న‌ట్లు తెలిపారు. ఆన్‌లైచెన్ డిజిట‌ల్ లెర్నింగ్ ద్వారా పాఠాలు బోధించ‌డం అల‌వాటు చేసుకోవాల్సిందిగా ఉపాధ్యాయుల‌కు సూచించారు. విద్యార్థులు న‌ష్ట‌పోకుండా సిల‌బ‌స్‌ను పూర్తిచేసేలా ప్ర‌ణాళిక రూపోందించుకోవాల్సిన అవ‌స‌రం ఉంద‌ని పేర్కొన్నారు. (లాక్‌డౌన్‌లో ఆన్‌లైన్‌ బోధన! )

యూజిసి మార్గ‌ద‌ర్శ‌కాల అనుగుణంగా సెప్టెంబ‌ర్ 1నుంచి విశ్వ‌విద్యాలయాల్లో త‌ర‌గతులు తిరిగి ప్రారంభించేందుకు చ‌ర్య‌లు తీసుకుంటున్న‌ట్లు వెల్ల‌డించారు. ప్ర‌స్తుతం దేశంలో  క‌రోనా కేసులు 82 వేల‌కు చేరువ‌లో ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో స్కూళ్లు ఇప్పుడే తెర‌వ‌డం మంచిది కాద‌ని భావిస్తున్న‌ట్లు తెలిపారు. విద్యార్థుల ఆరోగ్యం దృష్ట్యా ప‌రిస్థితి సాధార‌ణం అయ్యాకే 50 వాతం మంది విద్యార్థుల‌తో ప్రాథ‌మికంగా పాఠ‌శాల‌లు ప్రారంభించ‌నున్న‌ట్లు స్ప‌ష్టం చేశారు. క‌రోనా వ్యాప్తి నేప‌థ్యంలో మార్చి 16 నుంచి దేశ వ్యాప్తంగా పాఠ‌శాలలు, క‌ళాశాల‌లు మూసివేసిన సంగ‌తి తెలిసిందే. అంతేకాకుండా అన్ని ర‌కాల ప‌రీక్ష‌లు ర‌ద్దుచేశారు. (ఫెయిలైన వారికి సీబీఎస్‌ఈ మరో చాన్స్‌ )

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top