75 ఏళ్లు నిండినవారికి కేబినెట్లో నో ఛాన్స్? | RSS gives some sage advice to LK Advani and Murli Manohar Joshi | Sakshi
Sakshi News home page

75 ఏళ్లు నిండినవారికి కేబినెట్లో నో ఛాన్స్?

May 26 2014 10:48 AM | Updated on Mar 29 2019 9:24 PM

75 ఏళ్లు నిండినవారికి కేబినెట్లో నో ఛాన్స్? - Sakshi

75 ఏళ్లు నిండినవారికి కేబినెట్లో నో ఛాన్స్?

నరేంద్ర మోడీ మంత్రివర్గంలో సీనియర్లకు మొండి చెయ్యి చూపే అవకాశాలు కనిపిస్తోంది.

న్యూఢిల్లీ : నరేంద్ర మోడీ మంత్రివర్గంలో  సీనియర్లకు మొండి చెయ్యి చూపే అవకాశాలు కనిపిస్తోంది. 75 ఏళ్లు నిండినవారికి కేబినెట్లోకి నో ఎంట్రీగా కనిపిస్తోంది. దాంతో పార్టీ సీనియర్ నేతలు ఎల్కె అద్వానీ (86), మురళీ మనోహర్ జోషీ(80)లకు చోటు దక్కకపోవచ్చనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.  పార్టీ సీనియర్లు అయిన వీరికి కేవలం పార్టీ పర్యవేక్షక బాధ్యతలు మాత్రమే అప్పగించనున్నట్లు సమాచారం.  

ఇక నరేంద్ర మోడీతో పాటు 18మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కొత్త టీమ్ సభ్యులకు మోడీ ఈరోజు ఉదయం గుజరాత్ భవన్లో తేనీటి విందు ఇచ్చారు. అలాగే పలువురు పార్టీ నేతలు ఆయనతో భేటీ అవుతున్నారు. అంతకు ముందు నరేంద్ర మోడీ మాజీ ప్రధాని వాజ్పాయిని కలిసి ఆశీస్సులు తీసుకున్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement