ఓ రేషన్ షాపు డీలరు, అతని సహాయకుడికి పదేళ్లు జైలుశిక్ష పడింది.
ఓ రేషన్ షాపు డీలరు, అతని సహాయకుడికి పదేళ్లు జైలుశిక్ష పడింది. 2006లో నిత్యావసర సరుకుల కోసం తన దుకాణానికి వచ్చిన ౩౩ ఏళ్ల వ్యక్తిని సదరు డీలరు, అతని సహాయకుడు సరుకులు లేవని వెనక్కి పంపే ప్రయత్నం చేయగా వివాదం తలెత్తి వ్యవహారం చివరకు హత్యకు దారితీసింది.
చెన్నై నగరంలోని సిద్దనూరు ప్రాంతంలో జరిగిన ఈ కేసును దాదాపు తొమ్మిదేళ్లు విచారించిన మద్రాస్ హైకోర్టు శుక్రవారం తన తుది తీర్పును వెలువరించింది. దోషులిద్దరికీ జైలుశిక్షతోపాటు ఐదేసి వేల రూపాయల జరిమానాను కూడా విధించింది