'ఎన్డీయే హయాంలోనే రామమందిర నిర్మాణం' | Ram Temple will be Completed During this Government's Tenure: VHP leader Sadhvi Prachi | Sakshi
Sakshi News home page

'ఎన్డీయే హయాంలోనే రామమందిర నిర్మాణం'

May 23 2015 9:56 AM | Updated on Apr 6 2019 9:31 PM

'ఎన్డీయే హయాంలోనే రామమందిర నిర్మాణం' - Sakshi

'ఎన్డీయే హయాంలోనే రామమందిర నిర్మాణం'

ఎన్డీఏ ప్రభుత్వ కాలపరిమితి ముగియక ముందే అయోధ్యలో రామాలయ నిర్మాణం పూర్తవుతుందని విశ్వహిందూ పరిషత్(వీహెచ్‌పీ) నాయకురాలు సాధ్వి ప్రాచీ అన్నారు.

జలంధర్: ఎన్డీఏ ప్రభుత్వ కాలపరిమితి ముగియక ముందే అయోధ్యలో రామాలయ నిర్మాణం పూర్తవుతుందని విశ్వహిందూ పరిషత్(వీహెచ్‌పీ) నాయకురాలు సాధ్వి ప్రాచీ శుక్రవారం అన్నారు. బీజేపీ దళిత మోర్చ జాతీయ కార్యవర్గ సమావేశానంతరం విలేకరులతో మాట్లాడుతూ త్వరలోనే రామమందిర నిర్మాణపనులు అయోధ్యలో  ప్రారంభమవుతాయన్నారు.

ఈనెల 25 నుంచి రెండురోజులు పాటూ వీహెచ్పీ మార్గదర్శక్ మండల సమావేశాలు హరిద్వార్లో జరగనున్నాయి. ఈ సమావేశాల్లోనే రామమందిర నిర్మాణం పై తుదినిర్ణయం తీసుకుంటామని సాధ్వి ప్రాచీ చెప్పారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement