కరోనా ఎఫెక్ట్‌ : రాజ్యసభ ఎన్నికలు వాయిదా | Rajya Sabha Elections Postponed Over Coronavirus | Sakshi
Sakshi News home page

కరోనా ఎఫెక్ట్‌ : రాజ్యసభ ఎన్నికలు వాయిదా

Mar 24 2020 12:22 PM | Updated on Mar 24 2020 5:30 PM

Rajya Sabha Elections Postponed Over Coronavirus - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : కరోనా వైరస్‌ రాజ్యసభ ఎన్నికలకూ పాకింది. వైరస్‌ వ్యాప్తి కారణంగా ఈనెల 26న జరిగే రాజ్యసభ ఎన్నికలను వాయిదా వేస్తున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. దేశంలో కరోనా వేగంగా వ్యాప్తి చెందుతున్న తరుణంగా ఈసీ ఈ నిర్ణయం తీసుకుంది. వైరస్‌పై తదుపరి పరిస్థితిని సమీక్షించిన అనంతరం.. కొత్త తేదీలను ప్రకటిస్తామని తెలిపింది. కాగా పది రాష్ట్రాల్లో ఇప్పటికే 37 సీట్లు ఏకగ్రీవంగా ఎన్నికయిన విషయం తెలిసిందే. మిగిలిన 18 స్థానాలకు ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది.
 

Advertisement
 
Advertisement
Advertisement