ఆరో రోజుకు హజారే దీక్ష | Raj Thackeray meets Anna Hazare | Sakshi
Sakshi News home page

ఆరో రోజుకు హజారే దీక్ష

Feb 5 2019 4:57 AM | Updated on Mar 9 2019 4:10 PM

Raj Thackeray meets Anna Hazare - Sakshi

రాలెగావ్‌ సిద్ధి (మహారాష్ట్ర): లోక్‌పాల్, లోకాయుక్తాల నియామకాలు చేపట్టాలని, రైతుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ సామాజిక కార్యకర్త అన్నా హజారే చేపట్టిన దీక్ష సోమవారం ఆరో రోజుకు చేరింది. దీక్ష కారణంగా అన్నాహజారే 4.25 కేజీల బరువు తగ్గారని, బీపీ పెరిగిందని డాక్టర్‌ ధనంజయ్‌ పొటే తెలిపారు. ఆయన ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తం చేస్తూ అన్నా హజారే ప్రాణాలను కాపాడాలని శివసేన, మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎమ్‌ఎన్‌ఎస్‌) కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశాయి. ఎమ్‌ఎన్‌ఎస్‌ అధ్యక్షుడు రాజ్‌ ఠాక్రే,, సామాజిక కార్యకర్త రాజేంద్ర సింగ్‌ సోమవారం హజారేను కలిశారు. ‘హజారే 2013లో చేసిన దీక్ష కారణంగానే బీజేపీ 2014లో అధికారంలోకి వచ్చింది. హజారే వల్లే కేజ్రీవాల్‌ ఎవరో దేశానికి తెలిసింది. అలాంటి వ్యక్తి కనీసం ధర్నాకు మద్దతు తెలియజేయలేదు’ అని ఠాక్రే అన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement