మున్సిపల్ ఎన్నికల ఫలితాలను వాయిదావేయాలని కోరుతూ వి.వి.రావు అనే వ్యక్తి బుధవారం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
సుప్రీంకోర్టులో పిటిషన్
సాక్షి, న్యూఢిల్లీ: మున్సిపల్ ఎన్నికల ఫలితాలను వాయిదావేయాలని కోరుతూ వి.వి.రావు అనే వ్యక్తి బుధవారం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇదే అంశంపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో నడిచిన వ్యాజ్యంలో ఈనెల 9న ఫలితాలు వెల్లడించొచ్చని కోర్టు ఆదేశాలు జారీచేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ఫలితాలను సార్వత్రిక ఎన్నికల అనంతరమే వెల్లడిచేయాలన్న సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా.. మున్సిపల్ ఎన్నికల ఫలితాలను కూడా సార్వత్రిక ఎన్నికల అనంతరమే ప్రకటించాలని పిటిషనర్ తరఫు న్యాయవాది రామకృష్ణారెడ్డి సుప్రీంకోర్టుకు విన్నవించారు. ఈ కేసు గురువారం విచారణకు వచ్చే అవకాశం ఉంది.