ఏపీ, ఒడిశాలకు సాయం: ప్రధాని | possible assistance should be extended to the states of cyclone:manmohan singh | Sakshi
Sakshi News home page

ఏపీ, ఒడిశాలకు సాయం: ప్రధాని

Oct 13 2013 2:10 AM | Updated on Sep 1 2017 11:36 PM

పై-లీన్ తుపాను బాధిత ప్రాంతాలకు అన్ని రకాలుగా సాయం కొనసాగించాలని ప్రధాని మన్మోహన్ సింగ్ ఆదేశించారు.

న్యూఢిల్లీ: పై-లీన్ తుపాను బాధిత ప్రాంతాలకు అన్ని రకాలుగా సాయం కొనసాగించాలని ప్రధాని మన్మోహన్ సింగ్ ఆదేశించారు. విదేశాల నుంచి తిరిగి వచ్చిన వెంటనే శనివారం ఆయన ఏపీ, ఒడిశాల్లో పై-లీన్ పరిస్థితిపై సమీక్ష నిర్వహించారు. ప్రస్తుత పరిస్థితి గురించి ప్రధానికి కేబినెట్ కార్యదర్శి వివరించారని ప్రధాని కార్యాలయం ‘ట్విట్టర్’లో పేర్కొంది.
 
 

హెలికాప్టర్లు, విమానాలు, నౌకలు సిద్ధం: షిండే
 
 

తుపాను బాధితులను రక్షించేందుకు, తక్షణ సహాయ చర్యల కోసం 18 హెలికాప్టర్లు, 12 విమానాలు, రెండు యుద్ధనౌకలు తూర్పు తీరంలో సిద్ధంగా ఉన్నాయని కేంద్ర హోం మంత్రి సుశీల్‌కుమార్ షిండే వెల్లడించారు. సహాయక చర్యల కోసం 2 వేల మంది సైనికులు ఆయా ప్రాంతాలకు చేరుకున్నారని తెలిపారు. ఒడిశాలో 5.5 లక్షల మందిని, ఏపీలో లక్ష మందిని 500 పునరావాస కేంద్రాలకు తరలించినట్లు పేర్కొన్నారు.   
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement