తొలి క్రాస్‌బోర్డర్‌ ‘పెట్రోలైన్‌’.. ప్రారంభించిన మోదీ | PM Modi and Nepal PM jointly inaugurate petroleum pipeline | Sakshi
Sakshi News home page

భార‌త్‌, నేపాల్ మధ్య పెట్రోలియం పైప్‌లైన్

Sep 10 2019 4:22 PM | Updated on Sep 10 2019 6:36 PM

PM Modi and Nepal PM jointly inaugurate petroleum pipeline - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: దక్షిణాసియాలోని తొలి క్రాస్‌బోర్డర్‌ పెట్రోలియం పైప్‌లైన్ భార‌త్‌, నేపాల్ మధ్య ప్రారంభమైంది. బిహార్‌లోని మోతీహ‌రి- నేపాల్‌లోని అమ్‌లేక్‌గంజ్ మ‌ధ్య నిర్మించిన ఈ పెట్రో పైప్‌లైన్‌ను ప్రధాని నరేంద్రమోదీ వీడియోకాన్ఫరెన్స్ ద్వారా ఆవిష్కరించారు. నేపాల్ ప్రధాని కేపీ శ‌ర్మ ఓలీతోపాటు పలువురు మంత్రులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 69 కిలోమీటర్ల ఈ పైప్‌లైన్‌ కోసం కేంద్రం రూ. 350 కోట్లు వెచ్చించింది. కేవలం 15 నెలల రికార్డ్ సమయంలో ప్రాజెక్ట్ పూర్తికావడంపై ప్రధాని మోదీ హర్షం వ్యక్తంచేశారు. నేపాల్ ప్రభుత్వ సహకారం, ఇరుదేశాల అధికారుల సమర్థత కారణంగానే ఇది సాధ్యమైందన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement