12 వ రోజూ పెట్రో సెగ | Petrol and Diesel prices hiked for 12th consecutive day | Sakshi
Sakshi News home page

12 వ రోజూ పెట్రో సెగ

Jun 18 2020 9:00 AM | Updated on Jun 19 2020 7:34 AM

Petrol  and Diesel prices hiked for 12th consecutive day - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : పెట్రోలు , డీజిలు ధరలు  రోజు రోజుకు పెను భారంగా మారుతున్నాయి.  దేశీయంగా  పెరుగుతూ వస్తున్న ధరలు వరుసగా 12వ రోజు గురువారం కూడా అదే బాటలో సాగాయి.  తాజాగా పెట్రోలుపై 46-53 పైసలు, డీజిల్‌పై 54-64 పైసలు పెరిగింది.  దీంతో  ఇప్పటివరకు పెట్రోలు ధర లీటరుకు 6 రూపాయల 55 పైసలు, డీజిలు ధర 7 రూపాయల 4 పైసలు  చొప్పున పెరిగింది.

ప్రధాన నగరాల్లో పెట్రోలు, డీజిలు ధరలు లీటరుకు
న్యూఢిల్లీ : పెట్రోలు ధర రూ. 77.81 డీజిల్  రూ.76.43
ముంబై :  పెట్రోలు ధర రూ. 84.66, డీజిల్  రూ.74.93
చెన్నై: పెట్రోలు ధర రూ. 81.32 డీజిల్  రూ.74.23

హైదరాబాద్ : పెట్రోలు ధర రూ.80.77, డీజిల్ రూ.74.70
అమరావతి : పెట్రోలు ధర రూ. 81.99 డీజిల్ రూ.75.14

 

ముడి చమురు అంతర్జాతీయంగా భారీగా పడిపోతున్నా..దేశీయంగా పెట్రోల్, డీజిల్‌ రేట్లు మాత్రం రికార్డు స్థాయి వైపు పరుగులు పెడుతున్నాయి. జూన్‌ 6 న మొదలైన పెట్రో ధరల పెంపు ప్రతీ రోజు కొనసాగుతూనే ఉంది.  ఇదే తీరు కొనసాగితే కొద్ది రోజుల్లోనే కొన్ని రాష్ట్రాల్లో రేటు రూ. 100 కూడా దాటేస్తుందన్న ఆందోళనలు నెలకొన్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement