-
రష్యాలో చిక్కుకుపోయిన దేశీ ఆయిల్ కంపెనీల ఆదాయం
న్యూఢిల్లీ: ఉక్రెయిన్పై యుద్ధానికి ప్రతిగా రష్యాపై ప్రపంచ దేశాలు విధించిన ఆంక్షలు ప్రస్తుతం భారత ఆయిల్ కంపెనీలకు తలనొప్పిగా మారాయి. ఆర్థిక ఆంక్షల నుంచి గట్టెక్కడంలో భాగంగా రష్యా తన దగ్గరున్న డాలర్లను భద్రపర్చుకోవడంపై మరింతగా దృష్టి పెడుతోంది. విదేశాలకు డాలర్లను పంపడంపై ఆంక్షలు విధించింది. దీంతో రష్యాలో ఇన్వెస్ట్ చేసిన దేశీ ఆయిల్ కంపెనీలకు రావాల్సిన 8 బిలియన్ రూబుళ్ల (రూ. 1,000 కోట్ల) మేర డివిడెండ్ ఆదాయం చిక్కుబడిపోయింది. ‘ఇన్వెస్ట్ చేసిన ప్రాజెక్టుల నుంచి మాకు తరచుగా డివిడెండ్ వచ్చేసేది. కానీ, ఉక్రెయిన్తో యుద్ధంతో విదేశీ మారకం రేట్లు తీవ్ర హెచ్చుతగ్గులకు లోనవుతున్నాయి. ఈ నేపథ్యంలో తమ దేశం నుంచి డాలర్లను ఇతర దేశాలకు పంపడంపై రష్యా ఆంక్షలు విధించింది. ఫలితంగా భారత కన్సార్షియంకు రావాల్సిన దాదాపు 8 బిలియన్ రూబుళ్ల డివిడెండ్ ఆదాయం రష్యాలో ఆగిపోయింది‘ అని ఆయిల్ ఇండియా డైరెక్టర్ హరీష్ మాధవ్ తెలిపారు. యుద్ధం మొదలు కావడానికి ముందు డివిడెండ్ ఆదాయం అంతా వచ్చేసిందని, కానీ ఆ తర్వాత నుంచి ఆగిపోయిందని పేర్కొన్నారు. అయితే, దీని గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. పరిస్థితి చక్కబడిన తర్వాత నిధులు తిరిగి రాగలవని ఆయన పేర్కొన్నారు. మరోవైపు, తమ పెట్టుబడులపై రష్యా–ఉక్రెయిన్ యుద్ధ ప్రభావమేమీ లేదని ఓఐఎల్ (ఆయిల్ ఇండియా) చైర్మన్ ఎస్సీ మిశ్రా తెలిపారు. ఓఐఎల్, ఐవోసీ, ఓఎన్జీసీ విదేశ్ తదితర దేశీ చమురు కంపెనీలు రష్యాలో నాలుగు వేర్వేరు అసెట్లలో 5.46 బిలియన్ డాలర్ల మేర ఇన్వెస్ట్ చేసాయి. వాంకోర్నెఫ్ట్ ఆయిల్ అండ్ గ్యాస్ క్షేత్రం లో 49.9 శాతం, టీఏఏఎస్–యూర్యాఖ్ క్షేత్రంలో 29.9 శాతం వాటాలు కొనుగోలు చేశాయి. ఆయా క్షేత్రాల గ్యాస్, చమురు విక్రయాల ద్వారా వచ్చే లాభాలపై డివిడెండ్లు అందుకుంటున్నాయి. -
Petrol Prices: పెట్రో పరుగు, చెన్నైలో కూడా సెంచరీ
సాక్షి, ముంబై: రెండు రోజులు విరామం తరువాత ఇంధన ధరలు శుక్రవారం మళ్లీ పరుగందుకున్నాయి. పెట్రోల్పై 35పైసలు పెరగ్గా, డీజిల్ ధర స్థిరంగా ఉన్నాయి. జూలై నెలలో మొదటి పెరుగుదల. తాజా పెంపుతో ఎనిమిది రాష్ట్ర రాజధానులలో పెట్రోలు ధర సెంచరీ మార్క్ను దాటి వాహనదారులకు చుక్కలు చూపిస్తోంది. పెట్రోలు ధర 100 రూపాయలు దాటి నగరాల్లో ఇపుడు చెన్నై చేరింది. చెన్నైలో పెట్రోల్ రూ.100.13 డీజిల్ రూ.93.72 పలుకుతోంది. రాజస్థాన్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, జమ్మూ కాశ్మీర్, ఒడిశా, లడఖ్, బీహార్, కేరళ, తమిళనాడు 12 రాష్ట్రాలున్నాయి. వివిధ నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు లీటరుకు ఢిల్లీలో పెట్రోల్ రూ. 99.16, డీజిల్ రూ. 89.18 ముంబైలో పెట్రోల్ రూ.105.24; డీజిల్ రూ. 96.72 కోల్కతాలో పెట్రోల్ రూ.99.04, డీజిల్ రూ. 92.03 బెంగళూరులో పెట్రోల్ రూ.102.48; డీజిల్ రూ.94.54 హైదరాబాద్లో పెట్రోల్ రూ103.05; డీజిల్ రూ.97.20 చదవండి: Stockmarkets: ఆటో జోరు, ఐటీ బేజారు -
Petrol, Diesel Price: మళ్లీ పెట్రో షాక్!
సాక్షి, ముంబై: పలు నగరాల్లో సెంచరీ మార్క్ను దాటి పరుగులు పెడుతున్న పెట్రోలు, డీజిల్ ధరలు వాహనదారులకు గుండెల్లో గుబులు రేపుతున్నాయి. రెండు రోజుల విరామం తర్వాత శుక్రవారం మళ్లీ ఇంధన ధరలను పెంచుతూ ప్రభుత్వ రంగ ఆయిల్ కంపెనీలు నిర్ణయించాయి. తాజా పెంపులో పెట్రో ధరలు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. ముఖ్యంగా వాణిజ్య రాజధాని ముంబైలో పెట్రోలు ధర 101 మార్క్ను తాకింది. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీ) గణాంకాల ప్రకారం పెట్రోల్ ధరను లీటరుకు 27 పైసలు,డీజిల్ 28 పైసలు పెరిగింది. దీంతో ఢిల్లీ లీటరు పెట్రోల్ ధర. 94.76, డీజిల్ ధర. 85.66గా ఉంది. రాజస్థాన్, మధ్యప్రదేశ్, మహారాష్ట్రలోని పలు నగరాల్లో లీటరు పెట్రోలు ధర 100 మార్కును ఇప్పటికే అధిగమించిన సంగతి తెలిసిందే. పలు నగరాల్లో పెట్రోలు, డీజిల్ ధరలు లీటరుకు ముంబైలో పెట్రోల్ ధర రూ. 100.98 , డీజిల్ 92.99 చెన్నైలో పెట్రోల్, డీజిల్ ధర రూ. 96.23, డీజిల్ ధర. 90.38 కోల్కతాలో పెట్రోల్ ధర రూ. 94.76, డీజిల్ రూ. 88.51 హైదరాబాద్లో పెట్రోల్ ధర రూ.98.48, డీజిల్ రూ. 93.38 అమరావతిలో పెట్రోల్ ధర రూ. 100.93, డీజిల్ రూ. 95.23 వైజాగ్లో పెట్రోల్ ధర రూ. 99.69, డీజిల్ రూ. 94.03 చదవండి: దీర్ఘాయుష్షు: మనిషి 120 సంవత్సరాలు జీవించవచ్చు! -
12 వ రోజూ పెట్రో సెగ
సాక్షి, న్యూఢిల్లీ : పెట్రోలు , డీజిలు ధరలు రోజు రోజుకు పెను భారంగా మారుతున్నాయి. దేశీయంగా పెరుగుతూ వస్తున్న ధరలు వరుసగా 12వ రోజు గురువారం కూడా అదే బాటలో సాగాయి. తాజాగా పెట్రోలుపై 46-53 పైసలు, డీజిల్పై 54-64 పైసలు పెరిగింది. దీంతో ఇప్పటివరకు పెట్రోలు ధర లీటరుకు 6 రూపాయల 55 పైసలు, డీజిలు ధర 7 రూపాయల 4 పైసలు చొప్పున పెరిగింది. ప్రధాన నగరాల్లో పెట్రోలు, డీజిలు ధరలు లీటరుకు న్యూఢిల్లీ : పెట్రోలు ధర రూ. 77.81 డీజిల్ రూ.76.43 ముంబై : పెట్రోలు ధర రూ. 84.66, డీజిల్ రూ.74.93 చెన్నై: పెట్రోలు ధర రూ. 81.32 డీజిల్ రూ.74.23 హైదరాబాద్ : పెట్రోలు ధర రూ.80.77, డీజిల్ రూ.74.70 అమరావతి : పెట్రోలు ధర రూ. 81.99 డీజిల్ రూ.75.14 ముడి చమురు అంతర్జాతీయంగా భారీగా పడిపోతున్నా..దేశీయంగా పెట్రోల్, డీజిల్ రేట్లు మాత్రం రికార్డు స్థాయి వైపు పరుగులు పెడుతున్నాయి. జూన్ 6 న మొదలైన పెట్రో ధరల పెంపు ప్రతీ రోజు కొనసాగుతూనే ఉంది. ఇదే తీరు కొనసాగితే కొద్ది రోజుల్లోనే కొన్ని రాష్ట్రాల్లో రేటు రూ. 100 కూడా దాటేస్తుందన్న ఆందోళనలు నెలకొన్నాయి. -
ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల లాభాలు ఆవిరి!
న్యూఢిల్లీ: సాధారణ ఎన్నికల నేపథ్యంలో పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదల ఆగిపోయే అవకాశం ఉందని అంతర్జాతీయ రేటింగ్ ఏజెన్సీ మూడీస్ అభిప్రాయపడింది. గతంలో గుజరాత్, కర్ణాటక రాష్ట్ర ఎన్నికల సమయంలో ప్రభుత్వం ధరల పెరుగుదలను నిలిపివేసిన మాదిరిగా ఈసారి కూడా తాత్కాలిక ఆంక్షలు విధించే అవకాశం ఉందని పేర్కొంది. ఏప్రిల్–మే సమయంలో సాధారణ ఎన్నికల షెడ్యూల్ ఉండగా.. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ఈకాలంలో ధరల పెంపు నిర్ణయం తీసుకోవద్దని ఆదేశించే అవకాశం ఉందని అంచనావేస్తోంది. ఈ నిర్ణయం వెలువడితే ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ కంపెనీలైన ఐఓసీ, బీపీసీఎల్, హెచ్పీసీఎల్ సంస్థల లాభాలపై ప్రతికూల ప్రభావం పడుతుందని విశ్లేషించింది.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
'రింకూ ఒక అద్బుతం.. కానీ అతడిని సెలక్ట్ చేయలేకపోయాం'
T20 WC: కోహ్లిపై విమర్శలు.. చీఫ్ సెలక్టర్ స్పందన ఇదే
దగాకోరు చంద్రబాబుతో తస్మాత్ జాగ్రత్త: పేర్ని నాని
ఓటర్ల అవగాహన కోసం కాలేజీ విద్యార్థులు వినూత్న ప్రదర్శన (ఫోటోలు)
మంగళగిరి పబ్లిక్ టాక్ లోకేష్ VS లావణ్య
దుబాయ్లో మళ్లీ దంచికొడుతున్న వాన.. పలు విమానాలు రద్దు
బ్రిజ్భూషణ్కు హ్యాండ్ ఇచ్చిన బీజేపీ.. సిట్టింగ్ ఎంపీకి నో ఛాన్స్
చంద్రబాబు పగ.. ఫస్టొచ్చింది.. పెన్షన్ రాలేదు
చంద్రబాబుకు రోజా సూటి ప్రశ్న
రజనీకాంత్ సినిమా మేకర్స్కు ఇళయరాజా నోటీసులు
తప్పక చదవండి
- అనంత హైవేపై కంటెయినర్ల నిండా డబ్బు
- Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్గా గృహప్రవేశం (ఫోటోలు)
- ప్రజ్వల్ రేవణ్ణపై లుక్ అవుట్ నోటీసులు..
- ఉడుపి హోటల్స్ ఎందుకంత ప్రసిద్ధి చెందాయో తెలుసా..!
- మాస్ రేపిస్టుకు బీజేపీ సపోర్ట్.. మండిపడ్డ రాహుల్ గాంధీ
- సీరియల్ నటి సీమంతం.. ఫోటోలు వైరల్
- సురేశ్ రైనా ఇంట మరో విషాదం.. రోడ్డు ప్రమాదంలో సమీప బంధువు మృతి
- నామినేషన్ దాఖలు చేసిన 'ఒమర్ అబ్దుల్లా'.. బారాముల్లా నుంచి బరిలోకి
- నా బెస్ట్ ఫ్రెండ్స్ లిస్ట్లో వారిద్దరే ఉన్నారు.. ఎన్టీఆర్ లేడు: రాజమౌళి
- ధోని తీరుపై విమర్శలు.. ఊహించలేదంటూ ఘాటు వ్యాఖ్యలు
Advertisement