ఆర్మీ పోస్టులే లక్ష్యంగా పాక్ కాల్పులు | Pakistan targets 4 Indian posts in Naushera sector of Kashmir | Sakshi
Sakshi News home page

ఆర్మీ పోస్టులే లక్ష్యంగా పాక్ కాల్పులు

Oct 16 2016 9:02 AM | Updated on Mar 23 2019 8:09 PM

ఆర్మీ పోస్టులే లక్ష్యంగా పాక్ కాల్పులు - Sakshi

ఆర్మీ పోస్టులే లక్ష్యంగా పాక్ కాల్పులు

పాకిస్తాన్ మరోసారి కాల్పుల ఉల్లంఘనకు పాల్పడింది.

జమ్మూకశ్మీర్ : పాకిస్తాన్ మరోసారి కాల్పుల ఉల్లంఘనకు పాల్పడింది. పాక్ దళాలు  తాజాగా సరిహద్దులో నౌషరా సెక్టార్‌ నియంత్రణ రేఖ వద్ద భారత దళాలపై పాక్ సైన్యం ఆదివారం ఉదయం కాల్పులకు తెగబడింది. నాలుగు ఆర్మీ పోస్టులే లక్ష్యంగా ఈ కాల్పులు జరిపారు.

అయితే వెంటనే అప్రమత్తమైన భారత భద్రతా దళాలు వెంటనే స్పందించి ధీటుగా సమాధానం ఇచ్చినట్లు ఆర్మీ అధికారులు తెలిపారు.  ఎదురు కాల్పుల్లో ఆర్మీ జవాన్లకు ఎలాంటి గాయాలు కాలేదని అధికారులు పేర్కొన్నారు. కాగా సరిహద్దు రక్షణ రేఖ వెంబడి పాకిస్తాన్‌ కాల్పుల ఉల్లంఘనలు నిత్యకృత్యంగా మారిన విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement