మోడీ ప్రమాణ స్వీకారానికి పాక్ ప్రధాని రాక
ఇస్లామాబాద్ : భారత ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి పాకిస్తాన్ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ హాజరు కానున్నారు. ఈ విషయాన్ని పాక్ ప్రభుత్వ వర్గాలు శనివారం ధ్రువీకరించాయి. ఈనెల 26న మోడీ ప్రమాణ స్వీకారం చేయనున్న విషయం తెలిసిందే. ఈ కార్యక్రమానికి నవాజ్ షరీఫ్తోపాటు పాక్ విదేశాంగ మంత్రి సర్తాజ్ అజీజ్ కూడా హాజరవనున్నట్లు సమాచారం. వీరు సోమవారం భారత్కు రానున్నట్లు పాక్ ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.
మరిన్ని వార్తలు