దేశ అత్యున్నత పురస్కారం భారతరత్నను మాజీ ప్రధాన మంత్రి అటల్ బిహారీ వాజ్పేయికి ఈనెల 27న ప్రదానం చేయనున్నారు.
న్యూఢిల్లీ: దేశ అత్యున్నత పురస్కారం భారతరత్నను మాజీ ప్రధాన మంత్రి అటల్ బిహారీ వాజ్పేయికి ఈనెల 27న ప్రదానం చేయనున్నారు. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ప్రొటోకాల్ను పక్కన పెట్టి మరీ వాజ్పేయి నివాసానికి వెళ్లి ఆయనకు అవార్డు అందించనున్నారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ హాజరుకానున్నారని ఈ మేరకు రాష్ట్రపతిభవన్ ఓ ప్రకటనలో తెలిపింది. వాజ్పేయితో పాటు స్వాతంత్య్ర సమరయోధుడు, మదన్ మోహన్ మాలవీయ (మరణానంతరం) భారతరత్నకు ఎంపికైన విషయం తెలిసిందే. ఈనెల 30న రాష్ట్రపతి భవన్లో జరిగే కార్యక్రమంలో ఆయన కుటుంబసభ్యులకు ఈ పురస్కారాన్ని అందజేయనున్నారు. ఆ రోజే పద్మ అవార్డుల ప్రదానం ఉంటుంది.