మరోసారి పంజా విసిరిన మావోయిస్టులు | Naxals strike again in Chhattisgarh, set 17 vehicles ablaze in Kanker. | Sakshi
Sakshi News home page

మరోసారి పంజా విసిరిన మావోయిస్టులు

Apr 12 2015 5:48 PM | Updated on Oct 9 2018 2:47 PM

ఛత్తీస్గఢ్లో మావోయిస్టులు మరో విధ్వంసానికి పాల్పడ్డారు. సుక్మా జిల్లాలో ఏడుగురు ఎస్టీఎఫ్ జవాన్లను హతమార్చి 24 నాలుగు గంటలలోపే కాంకేర్ జిల్లాలోని ఓ ఐరన్ ఓర్ మైనింగ్ కంపెనీపై దాడిచేసి 17 వాహనాలను తగలబెట్టారు.

ఛత్తీస్గఢ్లో మావోయిస్టులు మరో విధ్వంసానికి పాల్పడ్డారు. సుక్మా జిల్లాలో ఏడుగురు ఎస్టీఎఫ్ జవాన్లను హతమార్చి 24 నాలుగు గంటలలోపే కాంకేర్ జిల్లాలోని ఓ ఐరన్ ఓర్ మైనింగ్ కంపెనీపై దాడిచేసి 17 వాహనాలను తగలబెట్టారు.

కోరాల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బర్దాస్పూర్ ఐరన్ ఓర్ మైనింగ్ జరుగుతున్న ప్రాంతానికి వచ్చిన సాయుధ నక్సలైట్లు.. కూలీలను వెళ్లగొట్టి మైనింగ్ యంత్రాలు, జేసీబీలు, జీపులు ఇతరత్రా మొత్తం 17 వాహనాలకు నిప్పుపెట్టారని కాంకేర్ ఎస్పీ జితేంద్రసింగ్ మీనా తెలిపారు. ఘటన అనంతరం మావోయిస్టులు అడవిలోకి పారిపోయారని, వారికోసం పెద్ద ఎత్తున గాలింపు చర్యలు చేపట్టామని ఎస్సీ చెప్పారు. కాగా ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని పేర్కొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement