భారత తొలి ప్రధానమంత్రి జవహర్ లాల్ నెహ్రు వర్థంతి సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం ఘనంగా నివాళులు ...
న్యూఢిల్లీ : భారత తొలి ప్రధానమంత్రి జవహర్ లాల్ నెహ్రు వర్థంతి సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం ఘనంగా నివాళులు అర్పించారు. నెహ్రు దేశానికి అందించిన సేవలు మరువలేనివని ఆయన ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ఒక స్వాతంత్ర్య సమరయోధుడు సహకారం గుర్తుంచుకుంటుందని మోదీ పేర్కొన్నారు.
కాగా రాష్ట్రపతి ప్రణబ్ముఖర్జీ, ఉప రాష్ట్రపతి హమీద్ అన్సారీ, మాజీ ప్రధాని మన్మోహన్, ఏఐసీసీ అధినేత్రి సోనియా గాంధీ సహ పలువురు కాంగ్రెస్ నేతలు నెహ్రు సమాధి వద్ద అంజలి ఘటించారు.


