మానవత్వంపైనా.. ప్రస్తుత సమాజంపైనా కొంతమందిలో అపోహలు అలాగే ఉండిపోయాయి. ఏరోజుకు ఆరోజు మారిపోయే పత్రికల హెడ్డింగులు చూసి దేశం ఎక్కడికి వెళ్లిపోతోందో అని బాధపడిపోయే తలకాయలూ ఉన్నాయి. ఎక్కడా అవినీతే తప్ప.. మంచితనం, మంచి మనుషులు మచ్చుకైనా కనిపించడం లేదని వాపోయే కొంతమందికి ఊరట కలిగించడానికా అన్నట్టు గతేడాది మన దేశంలో ఓ అద్భుతం జరిగిపోయింది. ఇప్పటికి తలచుకున్నా అది అద్భుతంగానే ఉంటుంది!
2015 ఆగస్టు 8.. చెన్నైలోని అన్నా యూనివర్సిటీ పరిసరాల్లో దారి తప్పి తిరుగుతున్నారు ఇద్దరు తల్లీకూతుళ్లు. తల్లి పేరు తంగపొన్ను, కుమార్తె పేరు స్వాతి. బీఎస్సీలో చేరేందుకు కౌన్సెలింగ్ కోసం యూనివర్సిటీకి చేరుకున్నారు. అక్కడికి వచ్చాక తెలిసింది వారికి.. కౌన్సెలింగ్ చెన్నైలో కాదు కోయంబత్తూర్లో అని! అంతే.. వారి గుండెలు బద్దలయ్యాయి. స్వాతి కన్నీటిధారలు ఆగడం లేదు. పెద్ద పెద్ద చదువులు చదవాలని ఎన్నో ఆశలు పెట్టుకుంది ఆ అమ్మాయి.
తెల్లవారు జాము ఆరున్నర గంటలు కావస్తోంది. కొంతమంది వ్యాయామం కోసం యూనివర్సిటీ గ్రౌండ్లోకి వచ్చారు. స్వాతిని, తంగపొన్నుని చూశారు. దగ్గరకు చేరి ఏమైందో ఆరా తీశారు. జరిగిందంతా వారికి అర్థమైంది. స్వాతి రికార్డులు పరిశీలించారు.
బ్రిలియంట్ స్టూడెంట్! ఆ అమ్మాయి కెరీర్ నాశనం కాకూడదని నిర్ణయించుకున్నారు. వెంటనే ఓ వ్యక్తి తన కారులో వారిని విమానాశ్రయానికి తీసుకెళ్లాడు. తన సొంత డబ్బులతో వారిని కోయంబత్తూర్ ఫ్లైట్ ఎక్కించాడు. వారు మార్గమధ్యంలో ఉండగా మరికొందరు కోయంబత్తూర్లోని రిజిస్ట్రార్ను సంప్రదించారు. జరిగినదంతా చెప్పారు.
రిజిస్ట్రార్ మనసు కూడా కరిగిపోయింది. కానీ, ముందురోజే కౌన్సెలింగ్ ముగిసిపోయిందని, మరో గంటలో చేరుకోగలిగితే తాను చేయాల్సింది చేయగలనని ఆయన చెప్పాడు. ఉదయం 7.50లోగా రిజిస్ట్రార్ దగ్గరకు చేరుకోవాలి. దీంతో స్వాతి, తంగపొన్ను విమానం దిగగానే వారికోసం కొందరు వాహనాలతో కాపలా కాశారు. అనుకున్న సమయానికే అక్కడకు చేరుకునేలా చేశారు. రిజిస్ట్రార్ కూడా ముందే అన్నీ సిద్ధం చేసి ఉంచడంతో స్వాతికి అడ్మిషన్ దొరికింది. అంతే.. ఆ నిరుపేద కుటుంబం సంబరాల్లో మునిగిపోయింది. గొర్రెల కాపరిగా జీవితం గడుపుతోన్న తంగపొన్ను తన కుమార్తెకు సీటు లభించడం చూసి తన కళ్లను తానే నమ్మలేకపోయింది. ఇది కాదంటారా అద్భుతమంటే..!!
అలా అద్భుతం జరిగిపోయింది!
Published Fri, Oct 28 2016 8:49 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఫాప్, కోహ్లి విధ్వంసం.. గుజరాత్పై ఆర్సీబీ ఘన విజయం
విరాట్ కోహ్లి బుల్లెట్ త్రో.. గుజరాత్ బ్యాటర్ ఫ్యూజ్లు ఔట్! వీడియో
ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)
వారికి వాడుకుని వదిలేసే అలవాటు: కాంగ్రెస్పై మండిపడ్డ జ్యోతిరాదిత్య సింధియా
చెలరేగిన ఆర్సీబీ బౌలర్లు.. 147 పరుగులకు గుజరాత్ ఆలౌట్
కాలేజీ ఫెస్ట్లో ఉర్రూతలూగించిన సింగర్ కార్తీక్ (ఫోటోలు)
ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
ఆయన 27 ఏళ్లు పెద్ద.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవరీ నటి?
పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
తప్పక చదవండి
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement