పామేడులో హెలికాప్టర్‌పై మావోల కాల్పులు | Maoists fire on helicopter in khammam district | Sakshi
Sakshi News home page

పామేడులో హెలికాప్టర్‌పై మావోల కాల్పులు

Feb 7 2015 2:32 AM | Updated on Oct 9 2018 2:51 PM

ఖమ్మం జిల్లా సరిహద్దు ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లాలో మావోయిస్టులు ఓ హెలికాప్టర్‌పై కాల్పులు జరిపారు.

చర్ల: ఖమ్మం జిల్లా సరిహద్దు ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లాలో మావోయిస్టులు ఓ హెలికాప్టర్‌పై కాల్పులు జరిపారు.  ఆ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లాలో ఈ నెల 4న పంచాయతీ ఎన్నికలు జరిగాయి. పోలింగ్‌బాక్సులను పామేడు పోలీస్‌స్టేషన్‌లో అధికారులు భద్రపరిచారు.

వాటిని జిల్లా కేంద్రం బీజాపూర్‌కు తరలించేందుకు శుక్రవారం మధ్యాహ్నం హెలికాఫ్టర్ పామేడు పోలీస్‌స్టేషన్‌కు చేరుకుంది. అక్కడే మాటు వేసి ఉన్న మావోయిస్టు దానిపై కాల్పలు జరిపారు. అప్రమత్తమైన పామేడు పోలీసులు ఎదురు కాల్పులు జరపడంతో మావోయిస్టులు అక్కడి నుంచి పారిపోయారు. ఈ ఘటనలో హెలికాఫ్టర్‌కు ఎటువంటి నష్టం వాటిల్లలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement