జమ్ముకాశ్మీర్లోని రాంబన్ జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు కొండచరియలు విరగిపడుతుండటంతో హైవేపై రాకపోకలకు తీవ్ర అంతరాయం వాటిల్లుతోంది.
జమ్ము-శ్రీనగర్ రహదారిపై రాకపోకలు బంద్
Apr 5 2017 10:19 AM | Updated on Sep 5 2017 8:01 AM
శ్రీనగర్: జమ్ము - శ్రీనగర్ రహదారిపై వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. జమ్ముకాశ్మీర్లోని రాంబన్ జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు కొండచరియలు విరగిపడుతుండటంతో హైవేపై రాకపోకలకు తీవ్ర అంతరాయం వాటిల్లుతోంది. సోమవారం నుంచి ఎడతెరపిలేని వర్షం కురుస్తుండటంతో, అప్రమత్తమైన అధికారులు రహదారిపై వాహనాల రాకపోకలను నిలిపివేశారు.
Advertisement
Advertisement