మారకుంటే మరణమే  | Jammu Kashmir Governor Satya Pal Malik Warning Terrorists | Sakshi
Sakshi News home page

ఉగ్రవాదులకు గవర్నర్‌ మాలిక్‌ హెచ్చరిక  

Sep 15 2019 8:11 AM | Updated on Sep 15 2019 8:13 AM

Jammu Kashmir Governor Satya Pal Malik Warning Terrorists - Sakshi

శ్రీనగర్‌: కశ్మీర్‌లో విధ్వంసం సృష్టించేందుకు ప్రయత్నిస్తున్న ఉగ్రవాదులపై గవర్నర్‌ సత్యపాల్‌ మాలిక్‌ విరుచుకుపడ్డారు. పద్ధతి మార్చుకోకుంటే త్వరలో ప్రాణాలు కోల్పోతారని హెచ్చరించారు. జమ్మూలో జరిగిన ఓ కార్యక్రమంలో మాలిక్‌ మాట్లాడుతూ..‘పాక్‌కు అమ్ముడుపోయిన కొందరు యువకులు కశ్మీర్‌లోయలో పండ్లవ్యాపారులను చంపేస్తామని బెదిరిస్తున్నారు. నేను వీళ్లకు ఒకటే చెబుతున్నా. వెంటనే మీ(ఉగ్రవాదులు) పద్ధతిని మార్చుకోండి. పండ్ల వ్యాపారులను చంపే విషయం తర్వాత చూసుకోవచ్చు. మీరైతే మాత్రం తప్పకుండా చనిపోతారని గ్యారెంటీతో చెబుతున్నా’ అని వ్యాఖ్యానించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement