భద్రతా దళాల కాల్పుల్లో ఉగ్రవాది హతం | J&K: 1 terrorist killed in Kulgam, encounter underway | Sakshi
Sakshi News home page

ఎదురు కాల్పుల్లో ఉగ్రవాది హతం

Sep 2 2017 9:07 AM | Updated on Sep 12 2017 1:39 AM

కుల్గాం జిల్లా తంత్రిపోరా వద్ద భద్రతదళాలు, ఉగ్రవాదుల మధ్య ఎదురు కాల్పులు జరిగాయి.

సాక్షి, శ్రీనగర్‌ : భద్రతా దళాలు కాల్పుల్లో ఓ ఉగ్రవాది హతమయ్యాడు. జమ్మూకశ్మీర్‌లోని కుల్గాం జిల్లా తంత్రిపోరా వద్ద శనివారం ఉదయం భద్రతదళాలు, ఉగ్రవాదుల మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో మృతి చెందిన ఉగ్రవాదిని మచివాకు చెందిన ఇష్ఫాక్ పద్దార్గా గుర్తించారు. ఎదురు కాల్పులు కొనసాగుతున్నాయి. కాగా పాకిస్తాన్‌ శుక్రవారం కాల్పుల ఉల్లంఘనకు పాల్పడింది. ఫూంచ్‌ సెక్టార్‌లో పాక్‌ ఆర్మీ జరిపిన కాల్పుల్లో బీఎస్‌ఎఫ్‌ జవాను మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే పాక్‌ కాల్పులను భారత జవాన్లు సమర్థవంతంగా తిప్పికొట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement