ఆ బంధం ఈనాటిది కాదు: రాష్ట్రపతి | India, Sri Lanka ties have matured over time, says President | Sakshi
Sakshi News home page

ఆ బంధం ఈనాటిది కాదు: రాష్ట్రపతి

Feb 3 2016 8:35 PM | Updated on Aug 8 2018 6:12 PM

భారత్, శ్రీలంకల మధ్య స్నేహబంధం ఎంతోకాలం నుంచి కొనసాగుతుందని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ అన్నారు.

 న్యూఢిల్లీ : భారత్, శ్రీలంకల మధ్య స్నేహబంధం ఎంతోకాలం నుంచి కొనసాగుతుందని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ అన్నారు. సమకాలీన పరిస్థితులను కలుపుకొని రెండు దేశాలు ముందుకు సాగుతున్నాయన్నారు. 68వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని శ్రీలంకకు ప్రణబ్ శుభాకాంక్షలు తెలిపారు. శ్రీలంక, రాజకీయాల్లో కొత్త పుంతలు తొక్కుతూ, ఇరుదేశాల మైత్రిని మరింత బలోపేతం చేస్తారని ఆశిస్తున్నట్టు ప్రణబ్ ఆ దేశ అధ్యక్షుడు మైత్రిపాల్ సిరిసేనకు సందేశం పంపారు. శ్రీలంక తన లక్ష్యాలను నెరవేర్చుకోవడానికి భారత్ ఎల్లవేళలా సహాయపడుతుందని భరోసా ఇచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement