సరిహద్దుల్లో అక్రమ టెలిఫోన్ ఎక్స్ఛేంజ్
జల్పాయ్గురి: భారత్–నేపాల్ సరిహద్దుల్లోని పానిటంకీలో అక్రమంగా నిర్వహిస్తున్న టెలిఫోన్ ఎక్సే్ఛంజ్ను పోలీసులు గుర్తించారు. సిలిగురి పోలీసు కమిషనరేట్ పరిశోధనా విభాగం ఆధ్వర్యంలో సోమవారం రాత్రి దాడులు జరిపి దీనిని గుర్తించారు. దీంతో సంబంధమున్న రన్విజయ్ సింగ్ అనే వ్యక్తిని అరెస్టు చేశారు.
ఘటనా స్థలి నుంచి నేపాల్, భారత్లకు చెందిన 196 సిమ్ కార్డులు, 5 జీఎస్ఎమ్ గేట్వే మెషీన్లు, 4 ల్యాప్ట్యాప్లు, 3 ఓటర్ ఐడీలు, పెద్ద మొత్తంలో ఏటీఎం కార్డులను స్వాధీనం చేసుకున్నారు.