రజనీకాంత్‌కు హైకోర్టు నోటీసు | High court notices send to Rajinikanth | Sakshi
Sakshi News home page

రజనీకాంత్‌కు హైకోర్టు నోటీసు

Mar 11 2015 10:36 PM | Updated on Aug 31 2018 8:57 PM

సూపర్‌స్టార్ రజనీకాంత్‌కు మద్రాసు హైకోర్టు బుధవారం నోటీసులు జారీ చేసింది.

చెన్నై: సూపర్‌స్టార్ రజనీకాంత్‌కు మద్రాసు హైకోర్టు బుధవారం నోటీసులు జారీ చేసింది. రజనీకాంత్ పేరు వాడుకుని ఆయన వియ్యంకుడు (నటుడు ధనుష్ తండ్రి) కస్తూరి రాజా రూ. 65 లక్షల మోసానికి పాల్పడినట్లు సినీ ఫైనాన్షియర్ ముకున్‌చంద్ బోద్రా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

దీనిపై విచారణ చేపట్టిన న్యాయమూర్తి వారంలోగా రజనీకాంత్ తరపున బదులు పిటిషన్ దాఖలు చేయాలని నోటీసులు జారీ చేశారు. అయితే, గతంలో ముకున్‌చంద్ నిర్మించిన ‘మే హూన్ రజనీకాంత్’ అనే సినిమాకు తన పేరు వాడుకున్నందుకు రజనీకాంత్ కోర్టును ఆశ్రయించి, ఆ చిత్రాన్ని నిషేధిస్తూ ఉత్తర్వులు పొందడం గమనార్హం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement