మరోసారి తెగబడిన పాక్, తిప్పికొట్టిన జవాన్లు | Heavy overnight firing exchanges between India and Pakistan in Kashmir | Sakshi
Sakshi News home page

మరోసారి తెగబడిన పాక్, తిప్పికొట్టిన జవాన్లు

Jan 3 2015 10:01 AM | Updated on Mar 25 2019 3:03 PM

పాకిస్తాన్ మరోసారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. సాంబ సెక్టార్లో పాక్ బలగాలు జరిపిన కాల్పుల్లో నలుగురు సామాన్య ప్రజలు గాయపడ్డారు.


జమ్మూ : పాకిస్తాన్ మరోసారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. సాంబ సెక్టార్లో పాక్ బలగాలు జరిపిన కాల్పుల్లో నలుగురు గాయపడ్డారు. అంతకు ముందు కతువా, రాంఘర్, హిరనగర్, సాంబ సెక్టార్లలో   పాక్, భారత్ సైన్యాల మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. అయితే పాక్ సైన్యం కాల్పులను జవాన్లు సమర్థవంతంగా తిప్పికొట్టారు. నిన్న రాత్రి నుంచి ప్రారంభమైన కాల్పులు...శనివారం తెల్లవారుజాము వరకూ కొనసాగాయి.

కాల్పుల ఘటనపై ఆర్మీ ఉన్నతాధికారి మాట్లాడుతూ పాక్ సైన్యం భారత భూభాగంలోని బీఎస్ఎఫ్ స్థావరాలను లక్ష్యంగా చేసుకున్నట్టు తెలిపారు. అయితే భారత బలగాలు దీటుగా తిప్పికొట్టాయని ఆయన పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement