ముంబై: నగరంలోని హజీ అలీ దర్గాలోకి వెళ్లి సూఫీ ముస్లిం గురువు సమాధిని సందర్శించుకునేందుకు మహిళలకు కూడా హక్కుందని ముంబై హైకోర్టు శుక్రవారం ఉదయం ఇచ్చిన తీర్పు పట్ల మహిళల స్పందనలు భిన్నంగా ఉన్నాయి. ఇతర మతాల మహిళలు దీన్ని ఎక్కువగా హర్షిస్తూ వారు దీన్ని మహిళల విజయంగా పేర్కొంటుండగా, ముస్లిం మహిళల్లోనే ఎక్కువ మంది భిన్నంగా స్పందిస్తున్నారు. కోర్టు తీర్పుతో తమకు సంబంధం లేదని, తాము మాత్రం గర్భగుడి, సూఫీ సమాధి వద్దకు వెళ్లమని, ఎప్పటిలాగే దూరం నుంచి దర్శించుకొని పోతామని చెబుతున్నారు.
600 సంవత్సరాల క్రితానికి చెందిన సూఫీ గురువు సయ్యద్ పీర్ హజీ అలీ షా బుఖారి సమాధిని దర్శించుకునేందుకు 2011 సంవత్సరం వరకు దర్గా నిర్వాహకులు మహిళలను లోపలికి అనుమతించారు. అప్పటి వరకు అనుమతించిన వారు ఎందుకు హఠాత్తుగా మహిళలపై నిషేధం విధించారు? అప్పటి వరకు ఎలాంటి సందేహం లేకుండా సూఫీ సమాధిని సందర్శించుకున్న ముస్లిం మహిళలు ఇప్పుడు ఎందుకు సమాధి వద్దకు వెళ్లడానికి సందేహిస్తున్నారు? వారి వైఖరిలో ఎందుకు మార్పు వచ్చింది? ఇప్పుడైనా మహిళల మైండ్సెట్ మారాలని మహిళల నిషేధాన్ని హైకోర్టులో సవాల్ చేసిన ‘భారతీయ ముస్లిం మహిళా ఆందోళన్’ ప్రతినిధులు ప్రశ్నిస్తున్నారు.
‘కోర్టు తీర్పు ఆసక్తిదాయకంగానే ఉంది.
ఇతర మహిళలు దర్గా లోపలికి వెళితే వెళ్లనీయండి. ముస్లిం మహిళలు లోపలికి వెళ్లకుండా దూరం నుంచే సమాధిని సందర్శించుకుంటే మంచిదన్నది నా అభిప్రాయం’ అని శుక్రవారం దర్గాను సందర్శించిన 30 ఏళ్ల ఇల్లాలు నసీం బానో మీడియాతో వ్యాఖ్యానించారు. ‘కోర్టు తీర్పు ఎలా ఉన్నా మాకు సంబంధం లేదు. మేము దర్గా లోపలికి వెళ్లం. అది మగవాళ్ల హక్కు మాత్రమే’ అని షరీఫ్ పఠాన్ అనే మరో మహిళ వ్యాఖ్యానించారు. అడవాళ్లకు రుతుస్రావం లాంటి సమస్యలుంటాయి కనుక దర్గా లోపలికి వెళ్లకపోవడమే మంచిదని పఠాన్ వ్యాఖ్యానించారు. మహిళలకు ఉందే సమస్యల కారణంగానే కేరళలోని శబరిమళ ఆలయంలోకి, మహారాష్ట్రలోని శని శింగనాపూర్ ఆలయాల్లోకి మహిళలను అనుమతించడం లేదనే విషయం తెల్సిందే.
ముస్లిం ఏతర మహిళలు మాత్రం ఇది మహిళల గొప్ప విజయమని అభివర్ణిస్తున్నారు. ముంబై హైకోర్టు తీర్పు వెలువడిన రోజునే తాను దర్గాకు రావడం తన అదృష్టమని ఢిల్లీ నుంచి వచ్చిన భక్తురాలు మృణాలిని మెహతా లాంటి వారు వ్యాఖ్యానించారు. అయితే తీర్పు వెలువడిన వెంటనే దర్గాలోని సమాధిని సందర్శించే అవకాశం మాత్రం ఇంకా మహిళలకు దక్కలేదు. దర్గా నిర్వాహకులు తీర్పును పై కోర్టులో సవాల్ చేసుకునేందుకు వీలుగా తీర్పు అమలుపై హైకోర్టు స్టే మంజూరు చేసిన విషయం తెల్సిందే.
‘ఆ మహిళల మైండ్సెట్ మారాలి’
Published Sat, Aug 27 2016 5:46 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
టీడీపీ నేతల రౌడీయిజం.. పిన్నెల్లి భార్యకు గాయాలు
Haryana: మైనార్టీలో బీజేపీ! మాజీ సీఎం కీలక వ్యాఖ్యలు
పాక్ను ఓడించగానే రాత్రంతా సంబరాలు: రషీద్ ఖాన్
దాడులకు పబ్లిక్ గా బరితెగించిన లోకేష్
భర్తతో విడిపోయిన హీరోయిన్.. కూతురితో కలిసి..
తెలంగాణ: మళ్లీ భారీ వర్షం కురిసే ఛాన్స్
శతక్కొట్టిన ఆటపట్టు.. టీ20 వరల్డ్కప్ క్వాలిఫయర్ ఛాంపియన్గా శ్రీలంక
కారులో వాసన బాగుందని తెగ పీల్చుకుంటున్నారా.?
ఓటీటీలోకి వచ్చేస్తున్న మరో వివాదాస్పద మూవీ
అట్టర్ ప్లాప్ .. పవన్ కళ్యాణ్ స్పీచ్ పబ్లిక్ జంప్
తప్పక చదవండి
- టీ20 వరల్డ్కప్ 2024 కోసం భారత బి టీమ్.. కెప్టెన్గా కేఎల్ రాహుల్..!
- ఏనుగుల దాడిలో వీడియో జర్నలిస్టు మృతి
- ‘నోరు మెదపరేం రాహుల్జీ?’..ప్రధాని మోదీ విమర్శలు
- తెలుగులో డైరెక్ట్గా ఓటీటీలోకి వస్తున్న మూవీ, స్ట్రీమింగ్ ఎక్కడంటే?
- ఓటు వేద్దాం ఇలా.!
- వెస్ట్ నైలు వైరస్ని తొలిసారిగా అక్కడ గుర్తించారు! ఎవరికి ప్రమాదమంటే..
- SRH vs LSG: ఉప్పల్ మ్యాచ్కు వెళ్తున్న వారికి అలర్ట్! ఇలా అయితే..
- అధికారం శాశ్వతం కాదు.. వడ్డీతో చెల్లించే టైం వస్తుంది:కేటీఆర్
- ధోని ఆల్టైమ్ రికార్డు బద్దలు కొట్టిన సంజూ.. భారత తొలి క్రికెటర్గా..
- Konathala Ramakrishna: మీ సంగతి చూస్తాం
Advertisement