ఈవీఎంను జీప్‌లో మర్చిపోయారు!

Gujarat Poll Officials 'Forget' EVM In Jeep, Driver Brings It Back - Sakshi

రాజ్‌పిప్లా: గుజరాత్‌లో అసెంబ్లీ ఎన్నికల వేళ పోలింగ్‌ సిబ్బంది తమ అలసత్వాన్ని బయటపెట్టుకున్నారు. నర్మాదా జిల్లాలో దడియపద నియోజకవర్గంలో పోలింగ్‌ అనంతరం ఈవీఎంలను రాజ్‌పిప్లాలోని స్ట్రాంగ్‌రూమ్‌కు తరలించాల్సిన అధికారులు.. ఓ ఈవీఎం యూనిట్‌ను ప్రైవేటు జీప్‌లో మర్చిపోయి వెళ్లిపోయారు. ఈ విషయాన్ని జీప్‌ డ్రైవర్‌ గమనించి స్థానిక నేతలకు, అధికారులకు సమాచారమిచ్చారు. వ్యవహారం బయటకు పొక్కడంతో జిల్లా కలెక్టర్, ఎన్నికల అధికారి ఆర్‌ఎస్‌ నినమా నష్టనివారణ చర్యలు చేపట్టారు. ఆ ఈవీఎం యూనిట్‌ను పోలింగ్‌కు వినియోగించలేదన్నారు. పోలింగ్‌ సమయంలో సాంకేతిక సమస్య తలెత్తితే ప్రత్యామ్నాయంగా వాడుకోవడానికి ఆరు ఈవీఎం యూనిట్లను అందుబాటులో ఉంచామన్నారు. వీటిలోని ఓ యూనిట్‌ను అధికారులు జీప్‌లో మర్చిపోయారన్నారు. ఈ ఘటనకు సంబంధించి ఈసీకి ఇప్పటికే నివేదిక సమర్పించామన్నారు. విధుల్లో అలసత్వం వహించినందున సంబంధిత అధికారులకు షోకాజ్‌ నోటీసులు జారీచేస్తామన్నారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top